26.3 C
Hyderabad
September 19, 2026
వరంగల్హోమ్

మహా జన సముద్రం గా మారిన మేడారం

మేడారం మహాజాతర భక్తజన సంద్రమైంది. వన దేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి.

భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో మేడారం వైపు వచ్చే దారులన్నీ వేలాది వాహనాలతో నిండిపోయాయి, ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

మరోవైపు జంపన్నవాగు భక్తజనంతో నిండిపోయింది. భక్తులు పవిత్ర జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్నారు. వాగు తీరమంతా శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాల హోరుతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది.

సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మేడారం అడవులన్నీ భక్తుల జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి.

Related posts

అబద్ధాల పునాదులపై ఎంత కాలం ఇలా…?

Satyam News

జాతీయ సగటును దాటిన రాష్ట్ర వృద్ధి రేటు

Satyam News

భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు

Satyam News

దేశ రాజధాని పేరు మారబోతున్నది….?

Satyam News

సింగపూర్ బయలుదేరిన మంత్రి లోకేష్

Satyam News

గంజాయి రవాణాపై ఉక్కుపాదం

Satyam News

Leave a Comment