వరంగల్హోమ్

మహా జన సముద్రం గా మారిన మేడారం

మేడారం మహాజాతర భక్తజన సంద్రమైంది. వన దేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి.

భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో మేడారం వైపు వచ్చే దారులన్నీ వేలాది వాహనాలతో నిండిపోయాయి, ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

మరోవైపు జంపన్నవాగు భక్తజనంతో నిండిపోయింది. భక్తులు పవిత్ర జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్నారు. వాగు తీరమంతా శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాల హోరుతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది.

సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మేడారం అడవులన్నీ భక్తుల జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి.

Related posts

పెట్రోల్, డీజిల్ తో పాటు వంట గ్యాస్ కొరత లేదు

Satyam News

పంటకోత ప్రయోగ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాధికారి

Satyam News

ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన

Satyam News

కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ పనులపై క్షేత్రస్థాయి సమీక్ష

Satyam News

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

Satyam News

దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన కాక్‌రోచ్ జనతా పార్టీ నిరసన

Satyam News

Leave a Comment