వరంగల్హోమ్

మహా జన సముద్రం గా మారిన మేడారం

మేడారం మహాజాతర భక్తజన సంద్రమైంది. వన దేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి.

భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో మేడారం వైపు వచ్చే దారులన్నీ వేలాది వాహనాలతో నిండిపోయాయి, ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

మరోవైపు జంపన్నవాగు భక్తజనంతో నిండిపోయింది. భక్తులు పవిత్ర జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్నారు. వాగు తీరమంతా శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాల హోరుతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది.

సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మేడారం అడవులన్నీ భక్తుల జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి.

Related posts

టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణ

Satyam News

వెనిజులాలో భారీ భూకంపం: 32 మంది మృతి

Satyam News

ఎర్రకోటపై దాడిలో జైషేమొహ్మద్: యూఎన్ రిపోర్టు

Satyam News

గద్దర్ అవార్డ్ ఇచ్చిన ఉత్తేజంతో త్వరలో రెండో చిత్రం

Satyam News

కోల్ కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

Satyam News

చంద్రబాబుపై కేటీఆర్‌  ప్రశంసలు…. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

Satyam News

Leave a Comment