32.2 C
Hyderabad
September 19, 2026
కరీంనగర్హోమ్

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప

#Ramadugu

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రామడుగు గ్రామంలో మాల సంఘం కమిటీ ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ అన్నదానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై కే రాజు, తాసిల్దార్ దాసరి రాజ మల్లయ్య, మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కృపతో ఏటా ఈ ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు.

కేవలం పూజలు, భజనలకే పరిమితం కాకుండా, ‘అన్నదానం మహాదానం’ అనే సంకల్పంతో ప్రతి ఒక్కరికీ స్వామివారి ప్రసాదాన్ని అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు పూర్తి సహకారాన్ని అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నదాన వేదిక వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

వచ్చిన ప్రతి ఒక్కరికీ కమిటీ సభ్యులు స్వయంగా వడ్డించి, క్రమశిక్షణతో ప్రసాద వితరణ సాగేలా పర్యవేక్షించారు. అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు భక్తులకు, సహకరించిన కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మొయిజ్, 14వ వార్డ్ మెంబర్ సిరికొండ పల్లవి సాయి, ఉత్సవ కమిటీ మెంబర్స్, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.

Related posts

సాక్షికి పోటీగా రూ. 500 కోట్లతో విజయసాయి రెడ్డి మీడియా!

Satyam News

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి

Satyam News

లిక్కర్ స్కామ్‌: ప్రైవేట్ జెట్లు….. జల్సాలు…. ఆఫ్రికాలో పెట్టుబడులు!

Satyam News

ఓటర్ల జాబితా సవరణలో తప్పులు జరిగితే ఊరుకోం

Satyam News

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ మీటింగ్

Satyam News

టీడీపీ నేత మక్కెన కుమారుడి వివాహ వేడుకకు హాజరైన లోకేష్

Satyam News

Leave a Comment