27.2 C
Hyderabad
September 16, 2026
జాతీయంహోమ్

క్రైస్తవ మత సంస్థ విదేశీ నిధులపై సీబీఐ కేసు నమోదు

#timothyinitiative

భారత దేశంలో మత మార్పిడులు లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించేందుకు విదేశీ నిధులు సేకరించినట్లు ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ధృవీకరణ ఆధారంగా ఆ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. అమెరికాకు చెందిన క్రైస్తవ మిషనరీ సంస్థ ‘ది తిమోతి ఇనిషియేటివ్’పై విదేశీ నిధుల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈ ఆరోపణలు వచ్చాయి.

భారత్ లో మత కార్యకలాపాల కోసం విదేశాల నుంచి సుమారు రూ.92.55 కోట్ల నిధులను తీసుకువచ్చి, అనుమతులు లేకుండా వినియోగించినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సంస్థకు చెందిన భారత్ కార్యకలాపాల బాధ్యులు జోనాథన్ ఎస్. రాజన్, ఆర్థిక వ్యవహారాల బాధ్యుడు అజిత్ వర్గీస్ మాథైతో పాటు పలువురి పేర్లు కేసులో ప్రస్తావించారు.

ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం విదేశీ డెబిట్ కార్డుల ద్వారా భారత్‌లో నగదు ఉపసంహరణలపై ఈడీ చేపట్టిన దర్యాప్తు. 2026 ఏప్రిల్‌లో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక వ్యక్తి వద్ద అమెరికాలోని ట్రూయిస్ట్ బ్యాంక్ జారీ చేసిన 24 అంతర్జాతీయ డెబిట్ కార్డులు లభించడంతో దర్యాప్తు విస్తరించినట్లు కోర్టు సంబంధిత రికార్డులను ఉటంకించిన నివేదికలు వెల్లడించాయి. ఆ తర్వాత ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఈడీ జరిపిన  సోదాలు దీన్ని నిర్ధారించాయి.

2025 నవంబర్ నుంచి 2026 ఏప్రిల్ మధ్య సుమారు రూ.92.55 కోట్ల విదేశీ నిధులు భారత్‌లో ఖర్చు చేశారు. ఈ నిధులను సాధారణ బ్యాంకింగ్ మార్గంలో కాకుండా అమెరికాలో జారీ చేసిన విదేశీ డెబిట్ కార్డుల ద్వారా భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో నగదుగా ఉపసంహరించినట్లు దర్యాప్తులో గుర్తించారు.

ది తిమోతి ఇనిషియేటివ్‌ భారత్ కార్యకలాపాలను జోనాథన్ ఎస్. రాజన్ పర్యవేక్షించారని, ఆర్థిక వ్యవహారాలను అజిత్ వర్గీస్ మాథై నిర్వహించారని ఈడీ ఆరోపించింది. ఇతర వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో నగదు ఉపసంహరణలు, నిధుల వినియోగంలో సహకరించినట్లు కూడా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

అమెరికాకు చెందిన ది తిమోతి ఇనిషియేటివ్‌కు సంబంధించిన విదేశీ నిధుల వ్యవహారంపై 2026లో కర్ణాటకలో కేసు నమోదై, ఈడీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా బ్యాంకు జారీ చేసిన విదేశీ డెబిట్ కార్డుల ద్వారా భారత్‌లో భారీ మొత్తంలో నగదు ఉపసంహరణలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 2025 నవంబర్ నుంచి 2026 ఏప్రిల్ మధ్య సుమారు రూ.92.55 కోట్ల నిధుల వినియోగంపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ కేసులో ది తిమోతి ఇనిషియేటివ్‌తో పాటు జోనాథన్ ఎస్. రాజన్, మైకా మార్క్, అజిత్ వర్గీస్ మాథై, వర్గీస్ చాకో, బబ్లూ కుర్మి, సుప్రీమ్ జాయ్ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.

Related posts

16న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

Satyam News

భార్య ఎక్కువ తింటున్నదని హత్య చేసిన భర్త

Satyam News

జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బుకట్టలు నిజమే

Satyam News

బొత్స సత్యనారాయణ కు బ్రెయిన్ స్ట్రోక్

Satyam News

దుబాయ్ లో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా….

Satyam News

సంచలన నిర్ణయం తీసుకున్న తమిళనాడు దళపతి

Satyam News

Leave a Comment