క్రీడలుహోమ్

రికార్డులు సృష్టిస్తున్న యువ హాకీ క్రీడాకారిణి జ్యోతి సింగ్

#JyothiSingh

ఝాన్సీకి చెందిన 21 ఏళ్ల జ్యోతి సింగ్ ఇప్పటికే భారత మహిళల హాకీలో తన ప్రతిభను చాటుతోంది. ఆమె 2025లో జరిగిన FIH Hockey Women’s Junior World Cupలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. అలాగే గత ఏడాది సీనియర్ జట్టులో అరంగేట్రం చేసి FIH Hockey Pro Leagueలో నాలుగు మ్యాచ్‌లు ఆడింది. అందులో ప్రపంచ నెంబర్ 1 జట్టు నెదర్లాండ్స్ పై సాధించిన విజయంలో ఆమె ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. జ్యోతి చిన్ననాటి నుంచే క్రీడలతో అనుబంధం ఏర్పడింది.

ఆమె తండ్రి అంతర్జాతీయ స్థాయి దీర్ఘదూర పరుగు క్రీడాకారుడు. ఆయనతో కలిసి మైదానానికి వెళ్లి పరుగులు తీయడం, బ్యాడ్మింటన్ ఆడటం ఆమె రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. అయితే 11 ఏళ్ల వయసులో హాకీ స్టిక్ పట్టడానికి ప్రేరణ ఇచ్చింది ఆమె అక్క (కజిన్ సిస్టర్). తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ జ్యోతి చెప్పింది: “మా కుటుంబంలో క్రీడల పట్ల ఆసక్తి సహజం.

నాన్న అంతర్జాతీయ క్రీడాకారుడు కావడంతో ఆయనతో మైదానానికి వెళ్తూ ఉండేదాన్ని. కానీ హాకీ ఆడాలని నన్ను ప్రేరేపించింది నా అక్క. ఆమె సీనియర్ అకాడమీలో ఉండేది. సెలవుల్లో ఇంటికి వచ్చేప్పుడు ఆమెతో గడిపిన సమయం నాకు స్ఫూర్తి ఇచ్చింది.” కుటుంబం నుంచి వచ్చిన మద్దతు గురించి ఆమె ఇలా చెప్పింది: “మా కుటుంబం, కోచ్‌లు ఎప్పుడూ నన్ను ప్రోత్సహించారు.

ఒత్తిడి ఎప్పుడూ ఉండేది కాదు. నాన్న అనుభవాల నుంచి నేర్చుకునే అవకాశం నాకు ఉంది. అమ్మ క్రీడా నేపథ్యం లేకపోయినా మానసికంగా ఎంతో బలాన్నిస్తుంది.” తన కలను నిజం చేసుకునే దిశగా జ్యోతి మధ్యప్రదేశ్‌కు వెళ్లి గ్వాలియర్‌లోని Madhya Pradesh Women’s Hockey Academyలో శిక్షణ పొందింది. అక్కడ ఆమె తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంది.

తర్వాత ఆమె విజయాలు వరుసగా కొనసాగాయి. 2024లో జరిగిన Women’s Junior Asia Cupలో భారత జట్టును గోల్డ్ మెడల్ వైపు నడిపించింది. అలాగే ఈ ఏడాది జరిగిన Hero Hockey India League రెండో ఎడిషన్‌లో SG పిపర్స్ జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించింది.

తన ఆటలో కనిపించే పరిపక్వత, ఆత్మవిశ్వాసం ఆమె ప్రత్యేకత. అంచనాలు పెరిగినప్పుడు ఎదురయ్యే సవాళ్లపై జ్యోతి స్పందిస్తూ, “కొన్ని సార్లు మనం మనమీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటాం. ఆ స్థాయిలో ఆడలేకపోతే కష్టంగా ఉంటుంది. సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఆడేటప్పుడు అనుభవం తేడా కనిపిస్తుంది. అలాంటి సమయంలో మళ్లీ బేసిక్స్‌కి వెళ్లి, క్రమంగా మెరుగుపరుచుకోవడం ముఖ్యం” అని చెప్పింది.

ప్రస్తుతం జాతీయ శిబిరంలో శిక్షణ పొందుతున్న జ్యోతి దృష్టి ముందున్న కీలక టోర్నీలపై ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణలో జరగనున్న FIH Hockey World Cup Qualifiersతో పాటు ఆసియా క్రీడలు కూడా ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. “ఈ సంవత్సరం భారత్‌కు చాలా ముఖ్యమైనది. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్, ఆసియా క్రీడలు ఉన్నాయి. దేశం కోసం ఆడే ప్రతిసారి నా శక్తివంచన లేకుండా ప్రదర్శన ఇవ్వడమే నా లక్ష్యం” అని జ్యోతి స్పష్టం చేసింది.

 

Related posts

రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే పేదల ఇళ్ల కూల్చివేత

Satyam News

IOC నాయకుడు హర్భజన్ సింగ్ మృతి పట్ల సంతాపం

Satyam News

మహబూబ్ నగర్ లో ఘనంగా జగన్నాథ రథయాత్ర

Satyam News

తల్లిపై కన్నేసి కొడుకును కిడ్నాప్ చేసిన లవర్

Satyam News

సినీ దర్శకుడు పి సి ఆదిత్య కు దాదా ఫాల్కే గౌరవ పురస్కారం

Satyam News

త్వరలో మేడిన్‌ ఆంధ్రా షిప్స్…. ఏపీలో షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌

Satyam News

Leave a Comment