26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

ఇరాన్ పై దాడులు ప్రారంభించిన ఇజ్రాయిల్

#Tehran

అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై ప్రాణాంతక దాడులు ప్రారంభించాయి. శనివారం మధ్యాహ్న సమయంలో ఇరాన్ రాజధాని టెహరాన్ పై ఇజ్రాయిల్ దాడి చేసింది. నగరం నడిబొడ్డున భారీ పొగ మేఘాలు ఎగసిపడుతున్నట్లు సమాచారం. తొలి దాడి అలీ ఖొమైనీ కార్యాలయ సమీపంలో జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఇరాన్ సైనిక స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గూఢచారి విభాగాలకు సంబంధించిన లక్ష్యాలను టార్గెట్ చేసినట్లు ఆపరేషన్‌పై సమాచారం ఉన్న ఓ అధికారి వెల్లడించారు.

అయితే అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాల్ కట్జ్ ఈ దాడి “భయాలను తొలగించడానికి” చేపట్టిన చర్య అని పేర్కొన్నారు. అయితే దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించలేదు. టెహ్రాన్‌లో ఖమేనై కార్యాలయ సమీపంలో మొదటి పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ కూడా పేలుడు జరిగినట్టు ప్రసారం చేసింది, కానీ కారణంపై వివరాలు ఇవ్వలేదు.

అదే సమయంలో ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగించబడ్డాయి. దేశం తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఇజ్రాయెల్ సైన్యం “ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడుల అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు హెచ్చరిక జారీ చేసినట్లు” ప్రకటించింది.

Related posts

గద్వాల చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

Satyam News

అయ్యన్న నియోజకవర్గంలో పెట్టుబడుల వరద

Satyam News

తెలుగు వారందరూ అప్రమత్తంగా ఉండాలి

Satyam News

వాణిజ్య ఒప్పందంలో అమెరికా ఏకపక్ష మార్పులు?

Satyam News

Final: విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

Satyam News

పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయలు

Satyam News

Leave a Comment