మెదక్హోమ్

వైభవంగా జరుగుతున్న వైకుంఠఏకాదశి

వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దంపతులు సంగారెడ్డి పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకున్న మంత్రి దంపతులు, అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన స్వామి వారి పల్లకి సేవలో మంత్రి భక్తులతో కలిసి స్వయంగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైకుంఠపురం దేవాలయ అభివృద్ధికి, ముఖ్యంగా రాజగోపురం నిర్మాణానికి తన వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

‘కలలకు రెక్కలు’ పథకంతో విదేశీ విద్యకు సహకారం

Satyam News

మహాలక్ష్మీకి రెండు సంవత్సరాలు పూర్తి

Satyam News

మునిసిపల్ చైర్మన్ ఆర్యవైశ్య మహిళ ఎన్నిక

Satyam News

ప‌రకామ‌ణి చోరీ కేసులో కీలక వ్యక్తి హత్య?

Satyam News

ఎమ్మిగనూరు లో ఘనంగా మహిళా దినోత్సవం

Satyam News

డిసెంబర్ 6న ఆశ్రా జాతీయ సదస్సు

Satyam News

Leave a Comment