26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం

#10thClass

పల్నాడు జిల్లాలో 2026 మార్చి 16 నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు సంబంధించి శుక్రవారం స్థానిక పిఎన్సి అండ్ కేఆర్ పాఠశాలలో సమావేశం జరిగింది. జిల్లాలోని వివిధ పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చే నియమించబడిన చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్మెంట్ అడిషనల్ ఆఫీసర్లు శిక్షణలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే. రామారావు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు.

ఎండలు అధికంగా ఉండటం వలన అందుబాటులో అవసరమైన అంత మేరకు త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు పరీక్షల రాసే గదుల్లో పూర్తిస్థాయిలో వెళుతూ ఉండే విధంగా చూడాలని, ఫ్యాన్లు, ఇతర ఫర్నిచర్, మెడికల్ కిట్లు కచ్చితంగా అక్కడ ఉండాలన్నారు. ఈనెల 13, 14 తేదీలలో పరీక్ష పత్రాలను డిపాజిటింగ్ చేయడం ఉంటుందన్నారు.

అదేవిధంగా ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇస్తామన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 128 పరీక్షా కేంద్రాలలో 26 515 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ షేక్ సుభాని, వి. ఏసుబాబు, జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి వెంకటరమణ, అధికారులు ఐ కృష్ణా నాయక్, ఆర్ గోవిందరాజులు, సెల్వ రాజు,శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Related posts

షాబాద్‌లో ఆరు హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే

Satyam News

రూ 22 వేల కోట్లు దోచిన ఐబొమ్మ

Satyam News

శీతల మాత ఆలయంలో తొక్కిసలాట: 8మంది మహిళలు మృతి

Satyam News

ఫేక్ ప్రచారం చేసిన భూమన మనుషుల అరెస్టు

Satyam News

నర్సరావుపేట జేఎన్ టీయూకే నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం

Satyam News

సంప్ర‌దాయం ఆధునిక‌త‌ల మేళ‌వింపుగా బతుకమ్మ వేడుక‌లు

Satyam News

Leave a Comment