కృష్ణహోమ్

బాలల హక్కుల పరిరక్షణ బృహత్తరమైన బాధ్యత 

#CBN

బాలల హక్కుల పరిరక్షణ ఒక బృహత్తరమైన బాధ్యత అని, నిస్వార్ధంగా పిల్లల హక్కుల పరిరక్షణ, ఆరోగ్యం, విద్య, వికాసం కోసం పాటుపడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ ఎంపికైన కమిషన్ సభ్యులు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా సీఎం ను కలిశారు.

ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణకు కమిషన్ చేస్తున్న కృషికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం భరోసా ఇచ్చారని చైర్ పర్సన్ తెలిపారు. కమిషన్ సభ్యులను ఆత్మీయంగా పలకరించిన ముఖ్యమంత్రి గారు.. నిస్వార్ధంగా బాలల సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషిచేసి సమాజానికి ఉత్తమ పౌరులను అందించేలా కమిషన్ పనిచేయాలని ఆకాంక్షించారు.

సీఎంను కలిసిన వారిలో కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీబాబు, పద్మలత, డాక్టర్ నాగ మానస, డాక్టర్ శ్రీనివాసమూర్తి, మందాల గంగ సూర్యనారాయణ, చల్ల మధుసూదన రావు ఉన్నారు.

Related posts

టీడీపీ నేత మక్కెన కుమారుడి వివాహ వేడుకకు హాజరైన లోకేష్

Satyam News

హెరిటేజ్‌పై కుట్ర…. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌…!!

Satyam News

‘మా పిల్లల రక్తం తాగిన రాక్షసులు మీరు’

Satyam News

ట్రంప్ ను తొలగించాలని డెమొక్రాట్ల డిమాండ్

Satyam News

వైఎస్ గుట్టు బయటపెట్టిన వైసీపీ ప్రధాన కార్యదర్శి

Satyam News

అమరావతిలో హైటెక్‌ ఫిల్మ్‌ సిటీ….!!

Satyam News

Leave a Comment