ముఖ్యంశాలు హోమ్

దూసుకువస్తున్న “డిట్వా” తుఫాను

#Rain

“డిట్వా” తుఫాను నేరుగా చెన్నై వైపు దూసుకువస్తుండటంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ముప్పు పొంచి ఉంది. నవంబర్ 30వ తేదీ రాత్రి సమయానికి ఈ తుఫాను వాయుగుండం లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని బలమైన సంకేతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇది వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి, డిసెంబర్ 2వ తేదీ వరకు (సుమారు 30 గంటల పాటు) తిరుపతి,  నెల్లూరు జిల్లాల పరిసరాల్లోనే తిరుగుతూ అక్కడే స్థిరపడే అవకాశం ఉంది.

దీని ప్రభావం వల్ల నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో నెల్లూరు జిల్లాలో, ముఖ్యంగా కావలి నుండి ఉత్తర నెల్లూరు ప్రాంతాల్లో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించవచ్చు. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కనిపించనుంది.

Related posts

భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా?

Satyam News

పాత టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Satyam News

ఈ రోజు లోకేశ్ – రేపు చంద్రబాబు – ఢిల్లీకి!

Satyam News

Leave a Comment

error: Content is protected !!