కొద్ది రోజులుగా కాస్త తగ్గి.. ప్రజలతో హమ్మయ్యా అనిపించిన చలి మళ్లీ వణికించబో తుంది. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరగనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమ వారం నుంచి వారం రోజుల పాటు (జనవరి 5-12 వరకు) రాత్రిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గనున్నట్లు వెల్లడించారు. డిసెంబరు మొదటివారంలో నెల కొన్న కోల్వేవ్ పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు.
గజగజ వణికించేలా చలిగాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు. పగటి ఉష్ణోగ్ర తలు కూడా 25-26 డిగ్రీల మధ్య నమోదు అవుతా యని పేర్కొంటున్నారు. మరోవైపు రాత్రి, ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఉంటుందని హైదరా బాద్ వాతారణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. ఇక, శనివారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్లో 11.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావ రణ కేంద్రం తెలిపింది.
