పశ్చిమగోదావరిహోమ్

దళిత మహిళ పై దాడిచేసిన అగ్రకులస్తుడు

#crime

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ముడిచెర్ల గ్రామం లో దళిత మహిళపై అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి శుక్రవారం చోటు చేసుకుంది.

ఎర్ర వీర రాఘవమ్మ వాళ్ల బావగారైన ఎర్ర సత్యనారాయణ, పొలంలో మేకలు మేపుతుండగా, అదే గ్రామానికి చెందిన కలవల శ్రీధర్ రెడ్డి మేకలు తన పొలం లో పంటను తిన్నాయనే అనుమానం తో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కులాన్ని కించపరిచే విధంగా దూషించి మహిళ అనే కనికరం కూడా లేకుండా గొంతు నులిమి, పారతో దాడి చేసి రక్త గాయ మయ్యేలా చేశాడు.

తనను తీవ్రంగా గాయపర్చాడని వీర రాఘవమ్మ కన్నీటి పర్యంతమై తన బంధువులకు గ్రామస్తులకు వివరించింది. గ్రామస్తుల సలహా మేరకు ఆమె బంధువులు వీర రాఘవమ్మను అదే రోజు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అక్కడ చికిత్సపొందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ..విజయసాయికి నోటీసులు..??

Satyam News

గణనాథుని సేవించే మహా పర్వదినం

Satyam News

సిద్దరామయ్య రాజీనామా ఆమోదించిన కర్ణాటక గవర్నర్

Satyam News

యూరియా కట్టలపై ఫేక్ ప్రచారం గుట్టలు

Satyam News

గీతం ఎమ్‌సిఎ విద్యార్ధులకు భారీ వేతనంతో ఉద్యోగాలు

Satyam News

సీలైన్ సర్వీసెస్ సంస్థ ఎం డి గరగ స్వామిని అభినందించిన బుర్ర

Satyam News

Leave a Comment