26.3 C
Hyderabad
September 19, 2026
పశ్చిమగోదావరిహోమ్

దళిత మహిళ పై దాడిచేసిన అగ్రకులస్తుడు

#crime

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ముడిచెర్ల గ్రామం లో దళిత మహిళపై అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి శుక్రవారం చోటు చేసుకుంది.

ఎర్ర వీర రాఘవమ్మ వాళ్ల బావగారైన ఎర్ర సత్యనారాయణ, పొలంలో మేకలు మేపుతుండగా, అదే గ్రామానికి చెందిన కలవల శ్రీధర్ రెడ్డి మేకలు తన పొలం లో పంటను తిన్నాయనే అనుమానం తో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కులాన్ని కించపరిచే విధంగా దూషించి మహిళ అనే కనికరం కూడా లేకుండా గొంతు నులిమి, పారతో దాడి చేసి రక్త గాయ మయ్యేలా చేశాడు.

తనను తీవ్రంగా గాయపర్చాడని వీర రాఘవమ్మ కన్నీటి పర్యంతమై తన బంధువులకు గ్రామస్తులకు వివరించింది. గ్రామస్తుల సలహా మేరకు ఆమె బంధువులు వీర రాఘవమ్మను అదే రోజు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అక్కడ చికిత్సపొందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

ముంబై బిజినెస్ సర్కిల్‌లో ఆంధ్రప్రదేశ్ ‘న్యూ ఫోర్స్’!

Satyam News

క్షణానికో మాట మారుస్తున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

హైదరాబాద్‌లో భక్తి వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి రథోత్సవం

Satyam News

ఉల్లి రైతుకు క్వింటాకు రూ.1200 చెల్లించి కొనుగోలు

Satyam News

చిన జీయర్‌ యూ టర్న్: వైసీపీలో డైలమా.!

Satyam News

రైతులపై కపట ప్రేమ ఆపి డీజిల్ రేట్లు తగ్గించండి

Satyam News

Leave a Comment