పశ్చిమగోదావరిహోమ్

దళిత మహిళ పై దాడిచేసిన అగ్రకులస్తుడు

#crime

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ముడిచెర్ల గ్రామం లో దళిత మహిళపై అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి శుక్రవారం చోటు చేసుకుంది.

ఎర్ర వీర రాఘవమ్మ వాళ్ల బావగారైన ఎర్ర సత్యనారాయణ, పొలంలో మేకలు మేపుతుండగా, అదే గ్రామానికి చెందిన కలవల శ్రీధర్ రెడ్డి మేకలు తన పొలం లో పంటను తిన్నాయనే అనుమానం తో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కులాన్ని కించపరిచే విధంగా దూషించి మహిళ అనే కనికరం కూడా లేకుండా గొంతు నులిమి, పారతో దాడి చేసి రక్త గాయ మయ్యేలా చేశాడు.

తనను తీవ్రంగా గాయపర్చాడని వీర రాఘవమ్మ కన్నీటి పర్యంతమై తన బంధువులకు గ్రామస్తులకు వివరించింది. గ్రామస్తుల సలహా మేరకు ఆమె బంధువులు వీర రాఘవమ్మను అదే రోజు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అక్కడ చికిత్సపొందుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

సంచలనం సృష్టిస్తున్న పాక్ సినిమా ది నెక్స్ట్ సలాహుద్దీన్

Satyam News

ఒక సంకల్పం… ఒక సేవా యజ్ఞం… ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్‌

Satyam News

జనవరిలో జాబ్‌ కేలండర్‌…. 2026లో ఉద్యోగాల పండుగ..

Satyam News

గవర్నర్‌ను కలిసిన నూతన సీఎస్ సంజయ్ జాజు

Satyam News

6 ఖండాలు 44 దేశాలు 154 మంది ప్ర‌తినిధులు

Satyam News

రాజధాని రైతులకు చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌….!!

Satyam News

Leave a Comment