తూర్పుగోదావరిహోమ్

అధికారంలో ఉంటే రెడ్లు లేక పోతే కాపులు..

వైసీపీ నేత జగన్‌పై ముద్రగడ కుమార్తె క్రాంతి ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు అప్పగించి ఇప్పుడు అధికారం పోగానే కాపులు గుర్తొస్తున్నారా?” అని జగన్‌ను ప్రశ్నించారు. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొన్నా అసలేమీ జరగలేదని తన తండ్రి ముద్రగడఎలా అంటున్నారో అర్థం కావడం లేదన్నారు.

కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేక కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అంబటి రాంబాబును వాడుకుని అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని, రేపు తన తండ్రిని కూడా అలా చేయరని గ్యారెంటీ ఏముందని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు ఏటా రూ.2 వేల కోట్లు ఇస్తానన్న జగన్ మాట తప్పారని గుర్తుచేశారు.

Related posts

మిరాకిల్ చేద్దాం రండి అంటున్న హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్

Satyam News

ఇమ్రాన్ ఖాన్ మృతిపై సంచలన పుకార్లు?

Satyam News

రూ. 347 కోట్లతో జోగులాంబ దేవాలయ అభివృద్ధి

Satyam News

మమతా బెనర్జీ పాలనపై మోడీ తీవ్ర విమర్శలు…

Satyam News

శ్రీలంక తీరంలో ఇరాన్‌ యుద్ధనౌకపై దాడి: 100 మంది మృతి?

Satyam News

దసరా నవరాత్రి ఉత్సవాలకు APTDC ప్రత్యేక ప్యాకేజీ

Satyam News

Leave a Comment