రంగారెడ్డిహోమ్

పకడ్బందీగా సంక్షేమ పథకాల అమలు

సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా చేపట్టే కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 20 నుండి 26 వరకు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంక్షేమ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ జిల్లాలో 34 గురుకుల పాఠశాలలన్నాయని, ఇట్టి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. గురుకుల పాఠశాలలను ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసు కుంటున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ వివరించారు. సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా చిన్నచిన్న మరమ్మతు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఉమా శంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ వెంకటా చారి, సీఈవో సుధీర్, డీఆర్ డిఓ శ్రీనివాస్, సిపిఓ వెంకటేశ్వర్లు, డిపిఓ జయసుధ, డిఇఓ రేణుకాదేవి, డిడబ్ల్యుఓ కృష్ణవేణి, డిటిడిఓ కమలాకర్ రెడ్డి, డిఎస్సీడీఓ జయపాల్ రెడ్డి, డిబిసిడిఓ మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రేటర్‌ అమరావతి…. మరో 20 వేల ఎకరాల భూముల సేకరణ…!!

Satyam News

అమెరికా నౌకాదళంలో భారతీయ బాలిక

Satyam News

సంచలనం సృష్టిస్తున్న రజనీకాంత్ సతీమణి

Satyam News

మహిళా రిటైర్ ఎస్‌.ఐ. మల్లేశ్వరి సేవలు అభినందనీయం

Satyam News

ప్రత్యేక ఓటరు సవరణ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Satyam News

జగన్ చేసిన తప్పులే ప్రజలకు శాపాలు

Satyam News

Leave a Comment