ఆది శిలాక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మండల పరిధిలోని బూడిదపాడు గ్రామానికి చెందిన రాజు దంపతులు ఐదు గొడుగులను బహుకరించారు.
ఆదివారం రాత్రి దేవాలయ ఆవరణలో పల్లకి సేవ రథోత్సవ కార్యక్రమం నిర్వహించిన రాజు దంపతులు వారు బహుకరించిన గొడుగులను స్వామివారికి సేవలో వినియోగించారు.
అనంతరం స్వామికి ఆలయ అర్చకులు వాల్మీకి పూజారులు సమక్షంలో అందజేసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు వారికి శాలువాతో ఘనంగా సన్మానించారు.
