అనంతపురంహోమ్

రైస్ పుల్లింగ్ పేరుతో చీటింగ్ చేసిన వైసీపీ నేత

శ్రీ సత్యసాయి జిల్లాలో రైస్ పుల్లింగ్ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడుతున్న వైసీపీ కన్వీనర్, రౌడీషీటర్ చింతకుంట కృష్ణా రెడ్డి (అలియాస్ డిక్కీ బాబు)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

తలుపుల మండలం వైసీపీ కన్వీనర్‌గా ఉన్న ఇతను, రైస్ పుల్లింగ్ మహిమ గల రాగి చెంబులు తయారు చేస్తానని, వాటిని అమ్మితే రెండు కోట్ల రూపాయల వరకు వస్తాయని నమ్మించి పలువురి వద్ద నుండి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

ఈ దారుణంపై కదిరి డీఎస్పీ శివన్నారాయణ స్వామి వివరాలను వెల్లడించారు. వేణుగోపాల్ రెడ్డి అనే బాధితుడి నుంచి నిందితుడు రెండు విడతలుగా 10 లక్షల రూపాయలు వసూలు చేయడమే కాకుండా, తిరిగి డబ్బులు అడిగినందుకు అతడిని తీవ్రంగా బెదిరించాడు.

దీంతో బాధితుడు తలుపుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి నుంచి ఒక ఫార్చునర్ కారు, మూడు సెల్ ఫోన్లు, రూ. 1,08,940 నగదుతో పాటు ఐదు రాగి చెంబులను స్వాధీనం చేసుకున్నారు. రేప్, మర్డర్, కిడ్నాప్, చోరీ వంటి ఏ నేరం జరిగినా అందులో వైసీపీ నేతల హస్తం ఉంటోందని ఈ సందర్భంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలు రైస్ పుల్లింగ్ వంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని, ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు

.

Related posts

హైదరాబాద్ నుంచి సోమశిల కు హెలికాప్టర్

Satyam News

చట్టాన్ని గౌరవించాలి సంయమనం పాటించాలి

Satyam News

ఆంధ్రా అంటే తన జాగీరు అనుకుంటున్నాడు!

Satyam News

మరో సారి వంట గ్యాస్ ధర భారీగా పెంపు

Satyam News

శ్రీ కంచి కామకోటి పీఠం విద్యాసంస్థల అడ్మిషన్లు ప్రారంభం

Satyam News

విజయసాయి రీఎంట్రీ..వైసీపీ సర్కిల్స్‌లో జోరుగా చర్చ.!

Satyam News

Leave a Comment