గుంటూరుహోమ్

128 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్

#KritikaShuklaIAS

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు అర్జీలను స్వీకరించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల  నుంచి వచ్చిన ప్రజలు 128 అర్జీలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ పై ఆడిట్ నిర్వహించాలన్నారు.

అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Related posts

మకర సంక్రాంతి తేదీపై వివాదం: పుణ్యకాలం పోతే పండగ ఎందుకు?

Satyam News

ఏపీ లిక్కర్ స్కామ్: ఐటి దాడులు

Satyam News

శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదంపై సమీక్ష

Satyam News

రజనీ పవర్ అర్థమైందా రాజా….

Satyam News

ఎల్లంపల్లి నీళ్లకు కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం

Satyam News

ఆవుల‌ను త‌ర‌లిస్తే ఖ‌బ‌డ్దార్‌: అర్ద‌రాత్రి ఎస్పీ త‌నిఖీలు

Satyam News

Leave a Comment