మహబూబ్ నగర్హోమ్

సైఫన్ గేట్లు తెరుచుకున్న సరళాసాగర్

#SaralaSagar

మదనాపూర్ సమీపంలోని సరళాసాగర్ జలాశయం వరద ప్రవాహాలతో ఉధృతంగా ఉప్పొంగుతోంది. జలాశయం వద్ద ఒక వుడ్ సైఫన్, ఒక ప్రైమరీ సైఫన్ ఆటోమేటిక్‌గా తెరుచుకోవడంతో భారీగా నీరు విడుదల అవుతోంది. దీంతో కాజ్‌వే బ్రిడ్జ్ పైకి వరద నీరు ప్రవహిస్తూ ప్రమాద స్థితి ఏర్పడింది. వరద ఉధృతి కారణంగా కొత్తకోట–ఆత్మకూర్, వనపర్తి మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక అధికారులు ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ఈ మార్గంలో ప్రయాణించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. వరద నీటి ఉధృతి తగ్గే వరకు పరిస్థితి సాధారణం కావడం కష్టమని అధికారులు తెలిపారు.

Related posts

ఎర్రకోటపై దాడిలో జైషేమొహ్మద్: యూఎన్ రిపోర్టు

Satyam News

వనపర్తి చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలి: సతీష్

Satyam News

భారత్ తో మాకు విభేదాలు లేవు: అమెరికా స్పష్టీకరణ

Satyam News

రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్ మృతి

Satyam News

భారీ వరద కూడా తట్టుకుని నిలబడ్డ పోచారం

Satyam News

నవ మల్లెతీగ మంత్లీ మ్యాగజైన్ ఆవిష్కరణ

Satyam News

Leave a Comment