34.9 C
Hyderabad
September 16, 2026
శ్రీకాకుళంహోమ్

శ్రీకాకుళంలో ఒక్క సీటు కూడా వైసీపీకి రాదు: తమ్మినేని

#YSJagan

​ఓ వైపు విజయనగరంలో చిన్నశీను పార్టీని వీడడంతో వైకాపా నాయకుల రోదన సభలు ఇప్పటికే వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంటే, మరోవైపు ఉత్తరాంధ్ర చివరన ఉన్న శ్రీకాకుళంలో కూడా వైకాపా సమాధి అవుతోందంటూ ఆ పార్టీ నాయకులే భవిష్యవాణి వినిపిస్తున్నారు.

​తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ తాజాగా వైకాపా భవిష్యత్తు గురించి చెబుతూ “ఒక్క సీటు కూడా వైసీపీకి రాదు. యస్, మీ సర్వే నివేదికలు తెప్పించుకోండి. తెప్పించుకుని చూడండి ఏ పార్టీకి ఎక్కడ ఏ ఎడ్జ్ ఉందో, ఏ పార్టీ గెలుస్తుందో! ఇలాగే గనక వెళ్తే ఇక్కణ్ణించి ఈ రెండున్నర సంవత్సరాలే కీలకం. ఒక రాజకీయ పార్టీ అంటే ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఒక జిల్లా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేదైనా ఉంటే… పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమించారు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నాన్నగారిని నియమించారు.

​మీరు ఒకే క్యాస్ట్ ని బేస్ చేసుకుని రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? లేదా మిమ్మల్ని నమ్మిన జగన్ మోహన్ రెడ్డి గారిని, ఈ పార్టీని నిట్టనిలువునా ముంచెయ్యాలనుకుంటున్నారా? క్యాండిడేట్‌ను మీరు బలిపశువును చేసుకుంటూ వస్తున్నారు కదా, చేసుకోండి ఎవడొద్దన్నాడు! ఈయనే క్యాండిడేట్, ఇంకెవ్వడూ రాడు అన్న అభద్రతాభావం మీకెందుకు? పార్లమెంటరీ పార్టీ పరిశీలకులకు గానీ ఇవేమీ కనపడటంలేదా? చెవులకు వినపడటంలేదా? అని నేను అడుగుతున్నాను. ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు క్యాస్ట్ బేస్ మీదే జరుగుతున్నాయని అందరికీ తెలిసిందే” అంటూ వ్యాఖ్యానించారు.

Related posts

హుస్నాబాద్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam News

మహిళా మండలి భవనం ప్రారంభోత్సవం

Satyam News

నారా లోకేష్ ప్రత్యేకత…. పాజిటివ్ పాలిటిక్స్!

Satyam News

రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఆధునిక టెక్నాలజీ

Satyam News

తల్లికి వందనం: ఈ నెల 22న తల్లుల ఖాతాల్లోకి రూ.10 వేల కోట్లు!

Satyam News

బాధ్యతలు స్వీకరించిన సుమలత

Satyam News

Leave a Comment