24.8 C
Hyderabad
September 12, 2026
గుంటూరుహోమ్

సీఎం చంద్రబాబును కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

#PVNMadhav

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి  మధుకర్ జీ కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ, సేవా–సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా–సంకల్ప్ అభియాన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చేపట్టాల్సిన వివిధ సేవా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. సేవా–సంకల్ప్ అభియాన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.

Related posts

పండగ రోజున లాఠీకి పని చెప్పిన పోలీసులు.

Satyam News

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనండి

Satyam News

ప్లేటు ఫిరాయించిన సోనం వాంగ్ చుక్

Satyam News

ఇరాన్ రక్షణ వ్యవస్థ పై అమెరికా భీకర దాడులు

Satyam News

SIR పై 5 నుంచి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు

Satyam News

మొన్న ఏఆర్ డీఎస్పీ నేడు ఎస్పీ… బాస్ ల సేవాతత్పరత

Satyam News

Leave a Comment