ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల విశిష్టతను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతానికి ‘గణేష్పురి’గా నామకరణం చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముంబైలోని లాల్బాగ్చా రాజా తర్వాత దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణేశుడే అత్యంత ప్రసిద్ధి అని గుర్తుచేశారు.
చారిత్రక కాలం నాటి పాత పేర్లను మార్చి, మన హిందూ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే పేర్లను పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఖైరతాబాద్ పేరును ‘గణేష్పురి’గా మారుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
