26.3 C
Hyderabad
September 19, 2026
చిత్తూరుహోమ్

కల్తీ లడ్డులో మరో 11 మంది నిందితులు

#Tirumala

పవిత్ర తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ కేసులో మరో 11 మందిని నిందితులుగా చేర్చారు. కేసు దర్యాప్తు చేస్తున్న Special Investigation Team (SIT), Central Bureau of Investigation (CBI) ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో కేసు పెద్ద మలుపు తీసుకున్నట్లు అయింది. 2019–24 మధ్య కాలంలో TTDకి సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యత లేని పదార్థాలు, ఇతర కెమికల్స్ మిక్స్ చేయబడినట్లు విచారణాధికారులు కనుగొన్నారు.

ఈ నెయ్యి ఉపయోగించి ప్రాచీన ప్రసాదం అయిన లడ్డును తయారు చేసినట్టు దర్యాప్తులో వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు నాలుగు డైరీ యజమానులు, ఇద్దరు అధికారులు అరెస్ట్ అయ్యారు. తాజాగా 7 మంది TTD ఉద్యోగులు, 5 మంది బయటి వ్యక్తులను విచారణ తర్వాత నిందితులుగా చేర్చారు. అంటే మొత్తం 12 మందికి పైగా నిందితులు ఉన్నారు.

ఒక స్థానిక TTD ఇంజనీరింగ్ శాఖ అధికారి, ప్రొక్యూర్ మెంట్ విభాగంలో GM గా పనిచేసిన RSSVR Subrahmanyam కూడా అరెస్ట్ అయ్యారు. 2019–24 మధ్య కాలంలో మొత్తం 48.76 కోట్ల లడ్డూలు తయారు అయినట్టు నమోదు అయింది. అందులో సుమారు 20.1 కోట్ల లడ్డూలు నాణ్యత హీనమైన నెయ్యితో తయారు అయ్యాయని సిట్ తెలిపింది.

నెయ్యి సప్లయర్ కంపెనీలు ఫేకు డాక్యుమెంట్లు, తప్పుడు ధృవీకరణs వాడి, టెండర్ విధానాలను మార్చి మోసం చేసి, నిబంధనలను ఉల్లఘించి నెయ్యి సరఫరా చేశారు. ఇది కేవలం ఆర్ధికపరమైన మోసం మాత్రమే కాదు. భక్తుల నమ్మకాన్ని, ఆలయ విశ్వాసాన్ని భంగపర్చే పెద్ద స్క్యాంగా మలచబడ్డదని ప్రభుత్వం, అధికారులు, రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ కేసులో నేరుగా ఉన్నవారి అదుపులోకి తీసుకోవడం, వారి ఉద్యోగ, డైరీ కాంట్రాక్టులు రద్దు చేయడం, ఆలయ ప్రసాదం తయారీ విధానాల్లో పారదర్శకత పెంపు చేయడం వంటి చర్యలు ప్రభుత్వం చేస్తున్నది. కొత్తగా మరో “11 మంది నిందితులు”గా చేరారు. వారిలో 7 గురు టీటీడీ ఉద్యోగులు—జీఎంలు, అసిస్టెంట్లు. జగదీశ్వర్‌రెడ్డి, మురళీకృష్ణ (మాజీ జీఎంలు), హరినాథ్‌రెడ్డి (పూర్వ ఎస్వీ గోశాల డైరెక్టర్) పేర్లూ లిస్ట్‌లో ఉన్నాయి.

Related posts

రోడ్డు ప్రమాదం లో హీరో భారత్ కాంత్ మృతి

Satyam News

జనవరిలో జాబ్‌ కేలండర్‌…. 2026లో ఉద్యోగాల పండుగ..

Satyam News

మత్తు పదార్థాల వల్ల భవిష్యత్తు అంధకారం

Satyam News

ముడి చమురు ధరలతో మార్కెట్లు పతనం

Satyam News

విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్న సంగీత

Satyam News

మునిసిపల్ చైర్మన్ ఆర్యవైశ్య మహిళ ఎన్నిక

Satyam News

Leave a Comment