మహబూబ్ నగర్హోమ్

మునిసిపల్ చైర్మన్ ఆర్యవైశ్య మహిళ ఎన్నిక

#Wanaparthy

వనపర్తి మునిసిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 33వ వార్డు కౌన్సిలర్,  ఆర్యవైశ్య మహిళ మిడిదొడ్డి ఎస్ఎల్ఎన్ మాదవి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.బిఆర్ఎస్, బిజెపి కౌన్సిలర్లు ఎన్నికలో పాల్గొనలేదు. వారు కౌన్సిలర్ గా ప్రమాణం చేసి బయటకు వెళ్ళారు. చైర్మన్ అభ్యర్థి మాదవి పేరును పరుశురాం ప్రతిపాదించారు.

శరవంద బలపరిచారు.చైర్మన్ పదవికి పోటీ లేనందుకు చైర్మన్ గా మాదవి ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారి, వనపర్తి ఆర్డివో సుబ్రహ్మణ్యం ప్రకటించారు.అదే విదంగా వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మధుసూదన్ గౌడ్(10వ వార్డు, నాగవరం) ఎన్నికయ్యారు.

కౌన్సిలర్ వెంకటేష్ ప్రతిపాదించారు. కౌన్సిలర్ బండారు విజయలక్ష్మి బలపరిచారు.మధుసూదన్ గౌడ్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారి సుబ్రహ్మణ్యం ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

చింతపల్లి శ్రీనివాసరావుకు రితిక ఫౌండేషన్ సత్కారం

Satyam News

వృద్ధి రేటు పెరుగుదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News

బూతులు.. కిడ్నాపులు.. హత్యలు.. జగన్‌ పరామర్శకు ఇవే అర్హతలా..?

Satyam News

కపిల్ శర్మ కేఫ్‌పై మూడోసారి కాల్పులు

Satyam News

సౌదీ ఆరామ్ కో రిఫైనరీని పేల్చేసిన ఇరాన్

Satyam News

కొడుకు సంతానానికి తల్లిగా మారిన తల్లి…….?

Satyam News

Leave a Comment