అంబటి రాంబాబు ఇంటి ముందు టీడీపీ శ్రేణుల ఆందోళన సమయంలో… అంబటి ఆఫీసుకి సొంత వర్గీయులే నిప్పు పెట్టారు. సత్తెనపల్లి వైసీపీ ఇంచార్జ్ భార్గవ్ రెడ్డి అనుచరులు నిప్పు పెట్టినట్టు తెలుస్తోంది.
కూటమి శ్రేణులు అంబటి ఇంటి దగ్గర ఆందోళన చేస్తుండగా… సందట్లో సడేమియాగా అంబటి సొంత వర్గం వాళ్లే ఈ పనికి ఒడిగట్టారు. సత్తెనపల్లి నుంచి వచ్చిన భార్గవడ్డి అనుచరులు ముందుగా ఆఫీసు ఆవరణలో ఉన్న కారుకు నిప్పు పెట్టారు.
అనంతరం ఆఫీసుకీ నిప్పు పెట్టాలని ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు వెంటనే మంటలు ఆర్పివశారు. నిప్పు పెట్టిన వైసీపీ నేతల్లో కొందరిని పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు
