సంపాదకీయంహోమ్

యువతకు చూపాల్సింది రీల్స్ కాదు… భవిష్యత్తు

మన యువతకు, తల్లిదండ్రులకు రీల్స్ కాదు చూపాల్సింది, దేశ అత్యున్నత ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి లాంటి వారి మాటలు. ఎందుకంటే ప్రస్తుతం టెక్నాలజీ ఒక మలుపు తీసుకుంటోంది. యువత భవిష్యత్తుకు ఇలాంటి వారి మార్గదర్శనం అత్యవసరం.

పొరుగు రాష్ట్రంలో పనిచేస్తున్నప్పటికీ, మన ఆంధ్రా కోసం, దేశం కోసం ఆయన ముందుకు వచ్చారు.అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపనలో ప్రొఫెసర్ వి. కామకోటి పూర్తి ప్రసంగ పాఠం:

“ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాంకేతిక విప్లవాలకు కొత్తేమీ కాదు. 1990వ దశకంలో ఆయన హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించి, భారతదేశ ఐటీ రూపురేఖలనే మార్చేశారు. ఈ రోజు ఆయన మళ్లీ అదే పనిని క్వాంటం కంప్యూటింగ్ ద్వారా అమరావతి క్వాంటం వ్యాలీతో చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పినట్లుగా.. 1990లలో మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విప్లవానికి ఎలాగైతే నాయకత్వం వహించామో, అదే విధంగా క్వాంటం టెక్నాలజీలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండి ఈ మార్పులో అగ్రగామిగా నిలవాలని మేము కోరుకుంటున్నాము.

ఆయన దార్శనిక నాయకత్వంలో, భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ మరియు డీప్ టెక్నాలజీ కోసం ఒక ప్రత్యేకమైన ‘క్వాంటం వ్యాలీ’ని ఊహించిన ప్రపంచంలోనే మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.ఒక ముఖ్యమంత్రి యువతతో మాట్లాడుతూ.. ‘మీ భవిష్యత్తు అత్యాధునిక సాంకేతికతలో ఉంది’ అని చెప్పినప్పుడు, ఆ సందేశానికి ఎంతో విలువ ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పరిశోధనల ఆధారంగా క్వాంటం కంప్యూటింగ్ రంగంలో ఎవరైనా ‘నోబెల్ బహుమతి’ పొందితే, వారికి 100 కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించడం అనేది చాలా శక్తివంతమైన సంకేతం. ఈ రాష్ట్రం ఎంత సీరియస్‌గా ఉందో దీని ద్వారా అర్థమవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి విద్యార్థికి క్వాంటం టెక్నాలజీపై కనీస అవగాహన ఉండాలనేది ఆయన ఆకాంక్ష. సాధారణంగా ఏ ప్రభుత్వాల్లోనైనా ఇలాంటి ప్రక్రియలకు 3 నుండి 5 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ, ఇక్కడ కేవలం 12 నెలల (ఒక ఏడాది) లోపే అంతా జరిగిపోయింది.

ఇది బ్యూరోక్రాటిక్ స్పీడ్ (అధికారిక వేగం) కాదు.. ఇది ‘క్వాంటం స్పీడ్’.మేము ఈ అవకాశాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లినప్పుడు.. ముఖ్యమంత్రి స్పందన ‘దీని గురించి మనం ఇంకా అధ్యయనం చేద్దాం’ అని కాకుండా.. ‘దీనిని మనం ఎలా సాధించాలి?’ అనే దిశగా ఉంది.”ఈ ప్రసంగం ద్వారా అమరావతి భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు ఎలా మార్గదర్శిగా ఉండబోతుందో ప్రొఫెసర్ స్పష్టంగా వివరించారు.

Related posts

సింగూరు ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న మంత్రి బామ్మర్ది

Satyam News

తిరుపతి నగరంలో వైసీపీ గూండాల అరాచకం

Satyam News

గిరిజన గ్రామాల్లో నారా భువనేశ్వరి పర్యటన ఎందుకోసం?

Satyam News

గద్వాల పట్టణంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి

Satyam News

దుబాయ్ ని వదిలి వెళుతున్న ప్రవాసులు

Satyam News

మహిళా అధికారిని బ్లాక్ మెయిల్ చేసిన జర్నలిస్టులు

Satyam News

Leave a Comment