అనంతపురంహోమ్

దేశ తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య జయంతి నేడు

#DamodaramSainjevaiah

ఆయన గురించి చెప్పాలి అంటే పెద్దపాడు నుండి కర్నూలు మునిసిపల్ బడికి చిరిగిన బట్టలు వేసుకుని 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి, రోజూ జొన్న రొట్టెలో కారం వేసుకుని తెచ్చుకునే సంజీవయ్య ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు అనుకుంటారు? అతని కష్టమే అతన్ని అక్కడ నిలబెట్టింది.

మద్రాసులో లా చదివే రోజుల్లో  మెస్ చార్జీల కోసం ఆయన గణిత ఉపాధ్యాయిడిగా పని చేస్తూ కష్టపడి చదువుకున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్రాస్ లా కాలేజీలో చదివే రోజుల్లోనే స్వతంత్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొని, నెహ్రు లాంటి జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. అనర్గళంగా ప్రజలను అర్రుతలు ఊగించేలా ఇంగ్లీషులో ప్రసంగించి నెహ్రు చేత ” సంజీవయ్య సార్”అని పిలిపించుకుని ఒక తిరుగులేని రాజకీయ వ్యూహకర్తగా మన్ననలు అందుకున్నారు. అతి చిన్న వయసులో కాంగ్రెస్ నాయకులుగా ఎన్నో రికార్డులు విజయాలు సాధించారు.

అందులో కొన్ని..

29 సంవత్సరాల వయసులో మొదటిసారిగా MLA గా ఎన్నిక అయ్యారు. అప్పట్లో అదొక రికార్డు

31 సంవత్సరాల వయసులో ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వంలో, సి.రాజగోపాలచారి కాబినెట్ లో మంత్రిగా ఎన్నిక అయ్యారు. అదొక రికార్డు

39 సంవత్సరాల వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా, అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని పొందిన రాజకీయ నేతగా పేరు ప్రతిష్టలు దక్కించుకున్నారు.

ఒంటిచేత్తో 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించిన సంజీవయ్య AICC జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నిక అయ్యి కేంద్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన మొదటి దళితుడి కూడా ఆయనే.

1964 సంవత్సరంలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సంజీవయ్య, కొంతకాలం నెహ్రు ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా, మరికొంతకాలం వాణిజ్య శాఖ మంత్రిగా, తర్వాత ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో మరోసారి ఇందిరా గాంధి ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, ఎన్నికై, కార్మిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.

దేశంలో మొట్టమొదటి వృధాప్య పింఛన్ల పథకం

దేశంలో మొట్టమొదటి వితంతు పింఛన్ల పధకం

1960 సంవత్సరంలో దళితులకు 6 లక్షల ఎకరాల ఇళ్ల పట్టాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ లో SC రిజర్వేషన్లు 14% నుండి 17 % పెంచడం, BC రిజర్వేషన్లు 24% నుండి 38% పెంచి, కాపులకు రిజర్వేషన్లు కల్పించడం. (తర్వాతి ప్రభుత్వాలు ఈ చట్టాలను వెనక్కు తీసుకున్నాయి)

1961 లో దేశంలోనే మొట్టమొదటిసారి,, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో SC, ST, BC లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయడం.

ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత పెంచడానికి కారణం అయిన, నిర్బంధ ప్రాథమిక విద్య, ఉన్నత చదువుల్లో పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు, మధ్యాహ్న భోజన పధకం.

1965లో కార్మిక శాఖ మంత్రిగా ఎన్నికయ్యాక, కార్మికులకు బోనస్ ఇచ్చే విధంగా చట్టం

కాంట్రాక్ట్ ఉద్యోగుల రక్షణ కోసం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం 1970

కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం, ఇప్పుడు ఎంతో మంది కార్మికులకు బాసటగా  చేసారు.

అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau), Prohibition and Excise డిపార్ట్మెంట్ లు నెలకొల్పారు.

ఆంధ్రప్రదేశ్ లో మొదటి ల్యాండ్ సర్వే

గ్రేటర్ హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు

మొదటి లా కమీషన్ ఏర్పాటు..

గాజులదీన్నే, వరదరాజుల స్వామి నీటి ప్రాజెక్టులతో రాయలసీమ కి సాగునీరు అందించడం..

పులిచింతల, వంశధార ప్రాజక్టుల నిర్మాణం

కళాకారుల కోసం లలిత కళా అకాడెమీ స్థాపన – ఇలాంటిది దేశంలోనే మొదటిది..

తెలుగుని రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించడం, ఉర్దూని రెండవ అధికారిక భాషగా ప్రకటించడం..

నిజాయితీ కి మారుపేరు నిస్వార్థమైన త్యాగజీవి సంజీవయ్య

రాజకీయంగా అంతటి ఉన్నత పదవులు అనుభవించినా, చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారు సంజీవయ్య. పిల్లలు ఉంటే, వాళ్ళ కోసం  సంపద పోగేసే ఆలోచన వస్తుందేమో అని, భార్య కృష్ణవేణమ్మ ని ఒప్పించి పిల్లలను కనకుండా జీవితం గడిపారు. 1967 లో ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై తర్వాతి క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై 8 మే 1972 న తుదిశ్వాస విడిచారు.

అదే రోజు వారి వివాహ వార్షికోత్సవం కావడం విశేషం. చనిపోయే సమయానికి ఆయనకు మిగిలిన ఆస్తులు, పెదపాడు గ్రామంలో ఒక రేకుల కప్పు ఇల్లు, తన హాఫ్ చేతుల కోటు పెట్టుకోవడానికి ఒక రేకు పెట్టె, భోజనం చేయడానికి ఒక ఇత్తడి పాత్ర, కొన్ని పుస్తకాలు……

Related posts

ట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనం ఎందుకు?

Satyam News

కాల్పులు చూసి నేను భయపడలేదు: ట్రంప్

Satyam News

ఘనంగా శ్రీ జీవన్ ముక్త మహారాజ్ ఉత్సవాలు

Satyam News

భారత్ రష్యా బంధం మరింత ధృఢంగా ముందుకు…

Satyam News

పాగుంట వెంకన్న స్వామి ఆలయానికి పోటెత్తిన‌ భక్తజనం

Satyam News

విశాఖలో కొట్టుకుపోయిన విదేశీయులు

Satyam News

Leave a Comment