26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

ఎగువ గొట్టివీడు యల్లమ్మ జాతరలో చాందిని బండి

గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు, యర్రయ్యగారిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ యల్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన కావలి రవణమ్మ చెంగయ్య కుమారుడు మోహన్ – శ్రావణి మొక్కుబడిలో భాగంగా ఏర్పాటు చేసిన చాందిని బండి పూజా కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కావాలి వారి కుటుంబ సభ్యులు ప్రసాద్ బాబుకు బ్రహ్మ రథం పట్టి, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి చాందిని బండిని శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ..”గ్రామ దేవతల జాతరలు సంస్కృతికి ప్రతీకలని, భక్తిభావం మనుషుల మధ్య ఐక్యతను పెంచుతుందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు” తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Related posts

No Sleep: నిద్ర పై ఎల్ ని నో తీవ్ర ప్రభావం

Satyam News

నమ్మిన భక్తుల కల్పతరువు శ్రీ తిమ్మప్ప స్వామి

Satyam News

ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్

Satyam News

మంత్రి శ్రీధర్ బాబుతో విక్టోరియా విప్ లీ టార్లామిస్ భేటీ

Satyam News

పీపీపీ మోడల్ పై జగన్ కు ఎందుకు అంత కక్ష?

Satyam News

ఇరాన్ ను మళ్లీ రెచ్చగొడుతున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

Leave a Comment