ఆధ్యాత్మికంహోమ్

ఎగువ గొట్టివీడు యల్లమ్మ జాతరలో చాందిని బండి

గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు, యర్రయ్యగారిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ యల్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన కావలి రవణమ్మ చెంగయ్య కుమారుడు మోహన్ – శ్రావణి మొక్కుబడిలో భాగంగా ఏర్పాటు చేసిన చాందిని బండి పూజా కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కావాలి వారి కుటుంబ సభ్యులు ప్రసాద్ బాబుకు బ్రహ్మ రథం పట్టి, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి చాందిని బండిని శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ..”గ్రామ దేవతల జాతరలు సంస్కృతికి ప్రతీకలని, భక్తిభావం మనుషుల మధ్య ఐక్యతను పెంచుతుందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు” తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా ఎస్ఎస్ జీ వార్షిక క్రీడల పోటీలు

Satyam News

మోదీ-చంద్రబాబు భేటీ వెనుక అసలు కథ!

Satyam News

మోడీ నిర్ణయం పై విరుచుకుపడ్డ సోనియాగాంధీ

Satyam News

బడ్జెట్ ప్రభావంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Satyam News

తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్

Satyam News

తమ్ముడు అకౌంట్‌ నుండి జగన్‌కి…. పీఏ పట్టించేశాడు…!!

Satyam News

Leave a Comment