ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని సోమవారం గద్వాలలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా Department of Economics & Department of Commerce. ఆధ్వర్యములో వినియోగదారుల హక్కులు, మరియు యంత్రాంగాల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ మీనాక్షి మాట్లాడుతు… వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే మోసాలకు గురికాకుండా ఉంటారని సూచించారు. వినియోగదారులుగా మనం ఎటువంటి వస్తువులను కొనగోలు చేయాలి, ప్రపంచములో ప్రస్తుతం వినియోగ దారుల – ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమములో అద్యాపకులు పి. సురేష్ బాబు, ఎం. వెంకటేష్, కె.చంద్రశేఖర్, జి. చంద్రశేఖర్రెడ్డి, బి.జగన్ మోహన్, లక్ష్మీనారాయణ, విద్యార్థినిలు పాల్గోన్నారు.
