ప్రపంచంహోమ్

యుద్ధ పరిస్థితి పై ప్రధాని మోడీ తో ట్రంప్ చర్చలు

#Modi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సుమారు 40 నిమిషాల పాటు కీలక అంశాలపై చర్చించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తదుపరి పరిణామాల నేపథ్యంలో ఈ సంభాషణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతర్జాతీయ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) సురక్షితంగా, తెరిచి ఉంచాల్సిన ఆవశ్యకతను ఇరువురు నేతలు నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు, సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ నిబద్ధతను చాటారు.

అమెరికా రాయబారి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంభాషణలో ట్రంప్ భారత్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ “మేమందరం మిమ్మల్ని ప్రేమిస్తున్నాము” అని మోదీతో అన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య ఇంధన రంగంతో పాటు పలు రంగాల్లో భారీ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని ఈ చర్చల ద్వారా స్పష్టమవుతోంది.

Related posts

పంటకోత ప్రయోగ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాధికారి

Satyam News

మ‌రి కొద్ది గంట‌ల‌లో విజ‌య‌గ‌న‌రం జిల్లా కు సీఎం

Satyam News

భూ రీ-సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

Satyam News

యుద్ధంలో ముగ్గురు భారతీయ సీఫేరర్ల మృతి

Satyam News

వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలకు అండగా నిలబడదాం

Satyam News

రామ్‌గోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

Satyam News

Leave a Comment