పశ్చిమగోదావరిహోమ్

కొల్లేరు సరిహద్దులు మార్పుల కోసం కేంద్రానికి లేఖ

కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దుల మార్పులపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అభయారణ్యం పరిధిని సుమారు 20,000 ఎకరాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు కొల్లేరు సరిహద్దుల హేతుబద్ధీకరణపై కేంద్ర సాధికార కమిటీకి లేఖ పంపింది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డెలైఫ్ (ఎన్బీడబ్ల్యూఎల్) స్టాండింగ్ కమిటీ 48వ సమావేశం చేసిన సిఫార్సులను అమలు చేయాలని కోరింది.

సరిహద్దుల నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతతోపాటు శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నట్లు లేఖలో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో సరిహద్దుల మార్పుపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) అనుమతి కోరాలని తీర్మానించారు.

ఈ నేపథ్యంలోనే 2018 నుంచి సరిహద్దుల మార్పుపై ఉన్న స్టే ఎత్తివేసి, తదుపరి చర్యలకు అనుమతి ఇవ్వాలని సీఈసీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే లేఖ రాశారు.

Related posts

దేవ దేవుడితో రాజకీయాలు చేస్తున్న బొత్స

Satyam News

చిన జీయర్‌ యూ టర్న్: వైసీపీలో డైలమా.!

Satyam News

పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి బండారు దత్తాత్రేయ

Satyam News

లో ప్రొఫైల్…. హై ఇంపాక్ట్‌…. లోకేష్ వర్కింగ్ స్టయిల్

Satyam News

కల్తీ ఆహార పదార్ధాలను పట్టుకున్న పోలీసులు

Satyam News

ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న చిప్ డ్రీమ్!

Satyam News

Leave a Comment