ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టిన ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నల్గొండ జిల్లాకు చెందిన చంటి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ (@chantidhorapally) ద్వారా తనపై అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టినట్లు అనసూయ ఫిర్యాదు చేశారు.
తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని అనసూయ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదును స్వీకరించిన సైబరాబాద్ పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని గుర్తించారు. నల్గొండలో ఉన్న చంటిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. సెలబ్రిటీలు తరచుగా ఇలాంటి వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో.. అనసూయ ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంపై సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.
