ముఖ్యంశాలుహోమ్

జగన్ అనుచరుడి ఉద్యోగం ఊడింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ వెంకట రామిరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆయన ఎన్నికల సమయంలో ఒక రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేసినట్లు నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకుంది. ఆయనకు ఇంకా 14 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉండటం గమనార్హం.

వెంకట రామిరెడ్డి గత ప్రభుత్వ కాలంలో రెండు సార్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ కాలంలో ఆయనపై అబ్కారీ నిబంధనల ఉల్లంఘన, ఎన్నికల సంఘం చర్యలు వంటి వివాదాలు కూడా నమోదయ్యాయి.

ఆర్టీసీ ఉద్యోగులను ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రేరేపించినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఆయనను సస్పెండ్ చేసింది. అలాగే అనుమతి లేకుండా ఉద్యోగులకు మద్యం పార్టీ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలతో అబ్కారీ శాఖ కేసు నమోదు చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత నియమించిన ప్రత్యేక కమిటీ ఈ ఆరోపణలను పరిశీలించి నిజమని తేల్చడంతో ఆయనను సేవల నుంచి తొలగించింది.

Related posts

22 న సిద్దిపేట జిల్లా నర్మేట లో ముఖ్యమంత్రి పర్యటన

Satyam News

జైలు సూపరింటెండెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

Satyam News

యూరియా ఎక్కువ వాడితే నేల విషతుల్యం

Satyam News

ప్రతీకార చర్యలకు దిగుతున్న మమతా బెనర్జీ పార్టీ

Satyam News

ఆర్టీసీ ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Satyam News

కేంద్రం చేతిలో కీలుబొమ్మ ఈ గవర్నర్

Satyam News

Leave a Comment