నడిగడ్డ భక్తులకే కాక సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల ఇలవేల్పు మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి మొక్కులు తీర్చుకున్నారు.
ఉదయం దేవాలయంలో అభిషేకాలు అర్చనలు పంచామృతాభిషేకం నిర్వహించి భక్తులకు వాల్మీకి పూజారులు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఎంతో భక్తి భావంతో దేవాలయానికి వచ్చే భక్తులకు దేవాలయం తరపున నాణ్యమైన రుచికరమైన అన్న దాన కార్యక్రమాన్ని అన్నదాన సత్రంలో పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆలయ వాల్మీకి పూజారులు అర్చకులు రవి చంద్రశేఖర రావు మధుసూదన్ రెడ్డి రామచంద్రారెడ్డి రాముడు పద్మా రెడ్డి భక్తులు పాల్గొన్నారు.
