అండమాన్ దీవిలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రేపటికి అల్పపీడనం గాను, 24 నాటికీ వాయుగుండం గా బలపడి 26 నాటికీ తుఫాన్ మారే సూచనలు 100% కనిపిస్తున్నది. గాలులు తీవత్ర ఉంటుంది… 26, 27, 28, 29, 30 డిశంబర్ 1, 2 తేదీల్లో చాలా ముఖ్యం అని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాటుతోంది, అనేది దాని గురించి ఇంకా క్లారిటీ ఐతే లేదు, అక్టోబర్ లో వచ్చే తుఫాన్లను అంచనా వెయ్యగలం, నవంబర్ లో వచ్చే తుఫాన్ అంచనా వైయడం కష్టం కాకపోతే మనకు సమయం దగ్గర కి వచ్చాక తీరాన్ని దాటే సూచనలు అధికంగా ఉంటాయి.
తమిళనాడు – చెన్నై, ఆంధ్రప్రదేశ్ – నెల్లూరు కాకినాడ మధ్య ఒడిస్సా- పశ్చిమబెంగాల్, బాంగ్లాదేశ్ ఎక్కడైనా తీరాన్ని దాటొచ్చు. ముందుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు,( రైతులు ముఖ్యంగా) వరి పండించిన రైతులు తమ ధాన్యన్ని జాగ్రత్త పరుచుకోవాలి,రోడ్లు పైనా,కాళీ స్థలాల్లో అరబెట్టిన ధాన్యన్ని జాగ్రత్త చేయండి.
తుఫాన్ వల్ల ఆస్థి నష్టం,ప్రాణనష్టం, రోడ్లపై వున్నా అనుమానం వున్నా ఎత్తైన చెట్లను నరికించడం ముందుగానే చర్యలు తీసుకోవాలి. అక్టోబర్ చివరి వచ్చిన మంతా తుఫాన్ ఏఫెక్ట్ చెట్టు, విద్యుత్ స్తంబాలు నేలకు వరగడం కరెంట్ కోత గురి కావడం ఎన్నో చూసాం, (మొత్తం రికవరీ అవ్వడానికి 24 గంటల పైనే సమయం పట్టింది))అలా జరగకుండా ముందుగానే జాగ్రత్త లు తీసుకోవాలి. విద్యుత్ తీగలపై వేలాడే చెట్ల కొమ్మలు తొలిగించాలి. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి.
