25.8 C
Hyderabad
September 16, 2026
క్రీడలుహోమ్

విజయవాడలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్‌

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ సెలెక్షన్ ట్రయల్స్‌ను విజయవాడలోని విఆర్ సిద్ధార్థ కాలేజీ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇలా అండర్-21 & ఓపెన్ వాలీబాల్ ట్రయల్స్ నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

WhatsApp Image 2026-08-06 at 19.28.21
Prime Volleyball League Trials conducted at Vijayawada

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ట్రయల్స్‌కు వచ్చిన క్రీడాకారులకు స్వాగతం పలికారు. ట్రయల్స్‌లో ప్రతిభ కనబర్చి ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ఆడే అవకాశాన్ని ప్రతి క్రీడాకారుడు అందిపుచ్చుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు టీడీపీ నాయకులు వెంకట, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమణ,  బ్లాక్ బాక్స్ వ్యవస్థాపకులు అభిషేక్ రెడ్డి, టెక్నికల్ ఆర్గనైజర్ తులసి రెడ్డి, సిద్ధార్థ కాలేజ్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Related posts

ఆందోళనకర స్థాయిలో బలహీనపడ్డ రూపాయి

Satyam News

42 % రిజర్వేషన్ లతో నే స్థానిక సంస్థల ఎన్నికలు

Satyam News

నీ బొమ్మల పిచ్చి కోసం ప్రజాధనం ఖర్చు  చేస్తావా?

Satyam News

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం

Satyam News

త్వరలో మేడిన్‌ ఆంధ్రా షిప్స్…. ఏపీలో షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌

Satyam News

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విజయవంతంగా శస్త్ర చికిత్స

Satyam News

Leave a Comment