కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామం లోని బుడగ జంగాల కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సీసీ రోడ్డు కోసం చొప్పదండి నియోజకవర్గం శాసన సభ్యులు మేడిపల్లి సత్యం మంజూరు చేయించారు. ఈ సిసి రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ రాపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్, కాలనీవాసులు కలిసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఉపసర్పంచి వడ్లూరి రాజు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుపురం పరుశురాం, సీనియర్ నాయకులు జెట్టి పెళ్లి వీరయ్య పొన్నం మల్లేశం, రాజు, సామి, సత్యం రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, అనిల్, బుడగ జంగాల కాలనీ వాసులు, కనకమల్లు,వెంకటేష్, నరసయ్య, మల్లయ్య, సత్యం, మానుపాటి సుధాకర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
