అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి గుత్తా అమిత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు శ్రీను యాదవ్ నాగనబోయిన, కరుణాకర్ వంగూరు, శేఖర్ నల్లబోతుల, రవీందర్ గడ్డంపల్లి తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించి ఆత్మీయంగా స్వాగతించారు.
తెలంగాణ అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి ప్రవాసుల సహకారం వంటి పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అతిథులు అభినందిస్తూ, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయిలు , అసోసియేషన్ సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
