మహబూబ్ నగర్హోమ్

అయిజలో అంతర్జాతీయ మహిళా కబడ్డీ టోర్నమెంట్

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గo అయిజ పట్టణంలో ఈనెల 14వ తేదీన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా టైగర్ యోబు యువసేన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్‌ను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా వేదికకు డాక్టర్ రవి కుమార్ దాతగా వ్యవహరించి సహాయసహకారాలు అందించారు.

ఈ టోర్నమెంట్ ఏప్రిల్ 13 మరియు 14 తేదీల్లో అయిజ లోని గుంత రామేశ్వర గుడి పక్కన ఉన్న మినీ పార్క్ ప్రాంగణంలో జరగనుంది. అంతర్జాతీయ స్థాయి మహిళా క్రీడాకారిణులు పాల్గొంటున్న ఈ పోటీలు క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నాయి.

విజేతలకు భారీ నగదు బహుమతులను ప్రకటించారు.

ప్రథమ బహుమతి: ₹50,000 (SSC 1986-1987 బ్యాచ్ మిత్రులు).

ద్వితీయ బహుమతి: ₹30,000 (పెద్దపల్లి అజయ్).

తృతీయ బహుమతి: ₹20,000 (డాక్టర్ వి. అరుణ్ కుమార్ ఆచారి).

నాల్గవ బహుమతి: ₹10,000 (సుబ్రమణ్యం శెట్టి).

మహిళా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్‌కు పట్టణ ప్రజలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు.

Related posts

వాయుగుండం నేపథ్యంలో అధికారులు అప్రమత్తం

Satyam News

వర్షం కోసం కృష్ణానది జలాలతో అభిషేకాలు

Satyam News

రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు

Satyam News

21 వ తేదీ నుండి సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు

Satyam News

తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగికదాడి?

Satyam News

పవర్ ఫుల్ పవన్ కల్యాణ్ దృష్టి ఇక ఎర్రచందనం పైనే…

Satyam News

Leave a Comment