జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గo అయిజ పట్టణంలో ఈనెల 14వ తేదీన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా టైగర్ యోబు యువసేన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా వేదికకు డాక్టర్ రవి కుమార్ దాతగా వ్యవహరించి సహాయసహకారాలు అందించారు.
ఈ టోర్నమెంట్ ఏప్రిల్ 13 మరియు 14 తేదీల్లో అయిజ లోని గుంత రామేశ్వర గుడి పక్కన ఉన్న మినీ పార్క్ ప్రాంగణంలో జరగనుంది. అంతర్జాతీయ స్థాయి మహిళా క్రీడాకారిణులు పాల్గొంటున్న ఈ పోటీలు క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నాయి.
విజేతలకు భారీ నగదు బహుమతులను ప్రకటించారు.
ప్రథమ బహుమతి: ₹50,000 (SSC 1986-1987 బ్యాచ్ మిత్రులు).
ద్వితీయ బహుమతి: ₹30,000 (పెద్దపల్లి అజయ్).
తృతీయ బహుమతి: ₹20,000 (డాక్టర్ వి. అరుణ్ కుమార్ ఆచారి).
నాల్గవ బహుమతి: ₹10,000 (సుబ్రమణ్యం శెట్టి).
మహిళా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్కు పట్టణ ప్రజలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు.
