మహబూబ్ నగర్హోమ్

అయిజలో అంతర్జాతీయ మహిళా కబడ్డీ టోర్నమెంట్

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గo అయిజ పట్టణంలో ఈనెల 14వ తేదీన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా టైగర్ యోబు యువసేన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్‌ను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా వేదికకు డాక్టర్ రవి కుమార్ దాతగా వ్యవహరించి సహాయసహకారాలు అందించారు.

ఈ టోర్నమెంట్ ఏప్రిల్ 13 మరియు 14 తేదీల్లో అయిజ లోని గుంత రామేశ్వర గుడి పక్కన ఉన్న మినీ పార్క్ ప్రాంగణంలో జరగనుంది. అంతర్జాతీయ స్థాయి మహిళా క్రీడాకారిణులు పాల్గొంటున్న ఈ పోటీలు క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నాయి.

విజేతలకు భారీ నగదు బహుమతులను ప్రకటించారు.

ప్రథమ బహుమతి: ₹50,000 (SSC 1986-1987 బ్యాచ్ మిత్రులు).

ద్వితీయ బహుమతి: ₹30,000 (పెద్దపల్లి అజయ్).

తృతీయ బహుమతి: ₹20,000 (డాక్టర్ వి. అరుణ్ కుమార్ ఆచారి).

నాల్గవ బహుమతి: ₹10,000 (సుబ్రమణ్యం శెట్టి).

మహిళా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్‌కు పట్టణ ప్రజలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు.

Related posts

భీమడోలు పంచాయతీలో భారీ అవినీతి

Satyam News

మంత్రి కొండా సురేఖను కలిసిన శైలజా రామయ్యర్

Satyam News

సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు పై కేసు నమోదు

Satyam News

బూతుల పర్వం వెనక ఐప్యాక్‌ స్కెచ్‌….??

Satyam News

₹ 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Satyam News

బద్దలవుతున్న జగన్‌ పీఏ అవినీతి కొండ….!!

Satyam News

Leave a Comment