32.2 C
Hyderabad
September 19, 2026
మహబూబ్ నగర్హోమ్

అయిజలో అంతర్జాతీయ మహిళా కబడ్డీ టోర్నమెంట్

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గo అయిజ పట్టణంలో ఈనెల 14వ తేదీన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా టైగర్ యోబు యువసేన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్‌ను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా వేదికకు డాక్టర్ రవి కుమార్ దాతగా వ్యవహరించి సహాయసహకారాలు అందించారు.

ఈ టోర్నమెంట్ ఏప్రిల్ 13 మరియు 14 తేదీల్లో అయిజ లోని గుంత రామేశ్వర గుడి పక్కన ఉన్న మినీ పార్క్ ప్రాంగణంలో జరగనుంది. అంతర్జాతీయ స్థాయి మహిళా క్రీడాకారిణులు పాల్గొంటున్న ఈ పోటీలు క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నాయి.

విజేతలకు భారీ నగదు బహుమతులను ప్రకటించారు.

ప్రథమ బహుమతి: ₹50,000 (SSC 1986-1987 బ్యాచ్ మిత్రులు).

ద్వితీయ బహుమతి: ₹30,000 (పెద్దపల్లి అజయ్).

తృతీయ బహుమతి: ₹20,000 (డాక్టర్ వి. అరుణ్ కుమార్ ఆచారి).

నాల్గవ బహుమతి: ₹10,000 (సుబ్రమణ్యం శెట్టి).

మహిళా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్‌కు పట్టణ ప్రజలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు.

Related posts

ఇరాన్ కు రష్యా సహాయం చేస్తున్నది: జెలెన్‌స్కీ

Satyam News

ఆర్డీటీ చిక్కుముడి విప్పిన లోకేష్!

Satyam News

జోగినపల్లి కి ఫ్లోరా శైని సెల్యూట్

Satyam News

ఆసుపత్రిలో అగ్గి: ముగ్గురు నవజాత శిశువల మృతి

Satyam News

ఫైనల్ కు దూసుకు వెళ్లిన టీమిండియా

Satyam News

ట్రంప్ విధానాలపై అమెరికా లో నిరసనల హోరు

Satyam News

Leave a Comment