26.3 C
Hyderabad
September 19, 2026
కడపహోమ్

కడపలో అర్ధరాత్రి దారుణం: ఇల్లు నేలమట్టం

#Demolition

కడప నగరంలోని ఎర్రముక్కపల్లి ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వంద మందికిపైగా రౌడీలతో వచ్చిన దుండగులు రెండు జెసిబిల సహాయంతో ఓ నివాస గృహాన్ని పూర్తిగా కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఈ కూల్చివేత జరగడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవి కుటుంబానికి చెందిన ఇంటిపై దాడి జరిపినట్లు బాధితులు తెలిపారు. ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులను బలవంతంగా బయటకు లాగి, తీవ్ర భయాందోళనకు గురిచేశారని ఆరోపించారు. ముసలివారు, చిన్నారులను కూడా కనికరం లేకుండా బయటకు తరలించారని వాపోయారు.

ఈ ఘటన వెనుక దొంగ రిజిస్ట్రేషన్లతో భూమిని కబ్జా చేయాలనే ప్రయత్నం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంటిని కూల్చివేయడానికి శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథరెడ్డి కారణమని వారు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రముక్కపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

న్యాయం చేయాలని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అక్రమ కూల్చివేతపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

ప్రభుత్వ సేవలకు రేటింగ్స్

Satyam News

ఇమ్రాన్ ఖాన్ భార్యకు 17 ఏళ్ల జైలు శిక్ష

Satyam News

ఏలూరుకు రిలయన్స్ రాక..రూ.2.73 లక్షల కోట్లతో అతిపెద్ద ప్రాజెక్ట్!

Satyam News

అమెరికా ఆయిల్ టాంకర్ పై ఇరాన్ దాడి?

Satyam News

రోడ్డు ప్రమాదంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ చౌదరి మృతి

Satyam News

అమ్మా…. నాకు ఆ అబ్బాయి కావాలి!

Satyam News

Leave a Comment