సినిమాహోమ్

విలక్షణ  దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్య కు వందేమాతరం అవార్డు

#PCAditya

వందేమాతర గీతం రచించి 150 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా బెంగళూరులో జరిగిన వందేమాతరం వేడుకలు అవార్డు ప్రధాన కార్యక్రమంలో తెలుగు సినీ రంగానికి చెందిన విలక్షణ  దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్య కు ప్రతిష్టాత్మక వందేమాతరం పురస్కారాన్ని అందజేశారు.

నైన్ ఫిగర్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్ణాటక లా కమిషన్ చైర్మన్ జస్టిస్ అశోక్ హాజరయ్యారు. ప్రత్యేక అతిధులుగా డాక్టర్ నే జ్యోతి నీరజ సీఈవో పీపుల్ ట్రీ హాస్పిటల్, ప్రముఖ సిని నిర్మాత సంతోష్ కుమార్ ఆచార్య తదితరులు హాజరయ్యారు.

ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు నిష్ణాతులకు వందేమాతరం అవార్డులను అందజేశారు. అందులో భాగంగా తెలుగు సినీ రంగానికి చెందిన నిత్య ప్రయోగశిలి, విలక్షణ దర్శకుడు డాక్టర్ పిసి ఆదిత్యను వందేమాతరం అవార్డుతో సత్కరించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు నైన్ ఫిగర్ మీడియా చైర్మెన్ కే సంపత్ కుమార్ మాట్లాడుతూ ఆదిత్య తన సుదీర్ఘ సినీ జీవితంలో ఎంతోమంది నూతన కళాకారులకు అవకాశాలు కల్పించడం అభినందనీయం. నేడు వందేమాతరం పురస్కారం అందుచేయటం మాకు సంతోషంగా ఉందన్నారు.

నిర్వాహకులు డాక్టర్ అభినందన్ మాట్లాడుతూ ఆదిత్య వంటి నిష్ణాతులైన దర్శకుడిని వందేమాతరం అవార్డుతో సత్కరించడం గర్వంగా ఉందన్నారు. ముఖ్య అతిథి జస్టిస్ అశోక్ బి మాట్లాడుతూ ఆదిత్య కేవలం తెలుగులోనే కాక కన్నడలో కూడా సందేశాత్మక చిత్రాలు రూపొందించాలని కోరారు.

ప్రముఖ శని నిర్మాత సంతోష్ కుమార్ ఆచార్య ఆదిత్య అభినందిస్తూ ఆదిత్య దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో మంచి చిత్రాన్ని రూపొందిస్తారని హామీ ఇచ్చారు. ప్రతిష్టాత్మక వందేమాతరం అవార్డు అందుకున్న ఆదిత్య స్పందిస్తూ రిపబ్లిక్ డే సందర్భంగా ఎవరిని అందుకోవడం సంతోషంగానే గర్వంగానే ఉందని నూతన ప్రతిభను  ప్రోత్సహించడంలో తనకు మరింత బాధ్యత కలిగిందని త్వరలోనే కన్నడ భాషలో కూడా సందేశాత్మక చిత్రం రూపొందిస్తానని హామీ ఇచ్చారు. వందేమాతరం అవార్డు గ్రహీత ఆదిత్యను అభిమానులు మిత్రులు అభినందించారు

Related posts

టెన్త్‌లో ఫ‌లించిన వంద‌రోజుల ప్ర‌ణాళిక‌

Satyam News

ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిడమర్రు మోడల్ స్కూల్

Satyam News

ముంచుకొస్తున్న ‘మొంథా’ తుఫాన్

Satyam News

ప్రకృతి వ్యవసాయ నమూనాలకు నెదర్లాండ్స్ ప్రశంసలు

Satyam News

దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న మునిసిపల్ వర్కర్లు

Satyam News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 10 మంది మృతి

Satyam News

Leave a Comment