ప్రపంచంహోమ్

ఇరాన్‌లో సైన్యం గుప్పిట్లోకి పాలనా పగ్గాలు!

#IranFlag

ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత ఆయన ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో, దేశ అధికార పగ్గాలు పూర్తిగా మిలిటరీ చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన భీకర దాడుల్లో ముజ్తబా ఖమేనీ ప్రాణాపాయం నుండి బయటపడినప్పటికీ, ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో ఆయన భార్య మరియు కుమారుడు మరణించగా, ముజ్తబా కాలికి తీవ్ర గాయమైంది. ఇప్పటికే ఆయనకు మూడు శస్త్రచికిత్సలు నిర్వహించారని, ప్రస్తుతం ఆయన నడవడానికి కృత్రిమ కాలు అవసరమని వైద్య వర్గాలు వెల్లడించాయి.

దాడుల తీవ్రత కారణంగా ముజ్తబా ముఖం, పెదాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఆయన ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. తన స్వరం వింటే శత్రువులు తన బలహీనతను పసిగడతారనే ఉద్దేశంతో, ఆయన కేవలం లిఖితపూర్వక ప్రకటనలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆయనకు రహస్య ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స అందుతోంది.

దేశంలో ఏర్పడిన ఈ నాయకత్వ శూన్యాన్ని భర్తీ చేసే క్రమంలో, ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్’ (IRGC) రంగంలోకి దిగింది. ప్రస్తుతం దేశంలోని కీలక నిర్ణయాలన్నీ ఐఆర్జీసీ జనరల్స్ అయిన అహ్మద్ వహీదీ, మొహమ్మద్ బాగేర్ తదితరులే తీసుకుంటున్నారు. దీనివల్ల ఎన్నికైన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వం కేవలం పేరుకే పరిమితమైంది.

ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వం కేవలం ఆహారం, ఇంధనం అంతర్గత శాంతిభద్రతలకే పరిమితమైంది. విదేశీ సంబంధాలు, ఇజ్రాయెల్‌పై దాడులు మరియు వ్యూహాత్మక నిర్ణయాల్లో ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేకుండా పోయింది.

ముజ్తబా ఖమేనీ తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు ఇరాన్ పూర్తిగా మిలిటరీ కనుసన్నల్లోనే నడిచే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలు గల్ఫ్ దేశాల్లో మరిన్ని ఉద్రిక్తతలకు దారితీస్తాయేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Related posts

తెలంగాణ లో ‘‘సర్’’ అమలుపై చర్యలు

Satyam News

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్ధులు

Satyam News

నిరాహార దీక్ష విరమించిన కాక్రోచ్ దీప్కే

Satyam News

డ్రగ్ మాఫియా కింగ్ కాల్చివేత

Satyam News

మధ్యప్రదేశ్ లో ఇక యూనిఫామ్ సివిల్ కోడ్

Satyam News

ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

Satyam News

Leave a Comment