ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం చర్చలు జరిపింది. ఎట్టకేలకు ఈ చర్చలు ఫలించాయి. దీంతో అర్ధరాత్రి సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి.
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు, కార్మీక సంఘాల గుర్తింపునకు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించటంతో మూడు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మీకుల సమ్మె ముగిస్తున్నట్టు కార్మీక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.
దీంతో మూడు రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
