గుంటూరుహోమ్

కత్వ చెరువు రిపేర్లు వెంటనే మొదలు పెట్టాలి

#KatvaTank

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్టేడియం దగ్గర, ఆవుల సత్రం దగ్గర కత్వ డ్రైనేజీ కాలవలు, చెరువులలో వ్యర్ధపదార్థాలు పారవేయడం, వాటిని కొందరూ ప్రైవేట్ వ్వక్తులు ఆక్రమించడం జరుగుతుందని దేశ భక్త ప్రజాతంత్ర (పిడిఎం) రాష్ట్ర కార్యదర్శి జి. రామకృష్ణ, జిల్లా కార్యదర్శి షేక్. మస్తాన్వలి అన్నారు. దీంతో వర్షాలు పడినప్పుడు వర్షపు నీళ్లు రోడ్డు మీద ప్రవహిస్తున్నాయని చెప్పారు.

నరసరావుపేట మున్సిపాలిటీ అధికారులు అక్రమణకు గురి అయిన వాటిని తొలగించడం లేదని ఆరోపించారు. నరసరావుపేట మునిసిపాలిటీ ఏటా రూ. 6 లక్షలు ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారే కానీ, బాగు చేయించాలని చాలా రోజుల నుంచి అధికారులు చెప్పడమే కానీ ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదన్నారు.

ఆక్రమణలు తొలగిస్తున్నట్లు అధికారులు హడావిడి చేసి, పైపైన తొలగించినట్లు చేసి చివరికి మౌనం దాల్చున్నారని పేర్కొన్నారు. మైనర్ ఇరిగేషన్, మున్సిపాలిటీ తదితర విభాగాలలో ఉన్నవాళ్లు ఆక్రమణలు తొలగించి పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Related posts

దుబాయ్ ని వదిలి వెళుతున్న ప్రవాసులు

Satyam News

ఈ సారి ఎండల తీవ్రత ఎక్కువ: జాగ్రత్త

Satyam News

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఐఏఎస్ అధికారుల బదిలీలు

Satyam News

అమెరికా నౌకాదళంలో భారతీయ బాలిక

Satyam News

హైదరాబాద్ లో భారీ గా పట్టుబడ్డ నకిలీ నోట్లు

Satyam News

వనపర్తి చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలి: సతీష్

Satyam News

Leave a Comment