ఆధ్యాత్మికంహోమ్

తిరుమలలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’

#Tirumala

శ్రీవారి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అత్యంత వైభవంగా ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు.

ఉగాది వేడుకలకు ముందుగా ఆలయ శుద్ధిలో భాగంగా గర్భాలయంలోని మూలమూర్తికి వస్త్ర ఆచ్ఛాదన చేసి, గర్భాలయ గోడలతో పాటు ఉపాలయాలను ‘పరిమళం’ అనే ప్రత్యేక సుగంధ ద్రవ్యంతో లేపనం చేసినట్లు ఆయన వివరించారు.

ఈ పరిమళ ద్రవ్యాన్ని మేళతాళాల మధ్య మంగళవాయిద్యాల తోడుగా ఆలయానికి తీసుకువచ్చి శుద్ధి ప్రక్రియను పూర్తి చేశారు. ఉగాది రోజున శ్రీవారికి వజ్రాభరణాలతో విశేష అలంకరణ చేసి, ఉగాది ఆస్థానం సందర్భంగా బంగారు వాకిలి వద్ద శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై వేంచేపు చేస్తారు.

సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో కొత్త పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తులకు సమర్పిస్తారని, అనంతరం బంగారు వాకిలిలో పంచముఖాల కొలువు మరియు పంచాంగ శ్రవణం కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఉగాది వేడుకల కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Related posts

మహిళా డాక్టర్ కు లైంగిక వేధింపులు: ఆత్మహత్య

Satyam News

రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

Satyam News

#TeamIndia: అణు క్షిపణులు తీసుకెళ్లే జలాంతర్గామి సిద్ధం

Satyam News

అమెరికా రాజీ యత్నాన్ని బూటకం అన్న ఇరాన్

Satyam News

గల్ఫ్ లో చిక్కుకున్న వారికి ఏపీ ప్రభుత్వ సహాయం

Satyam News

భూ భారతి భూ సర్వే అవగాహనా కార్యక్రమంలో స్పీకర్

Satyam News

Leave a Comment