క్రీడలుహోమ్

పరుగుల వేటలో బోల్తాపడ్డ భారత్

ఇండోర్ వేదికగా జరిగిన భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేలో కివీస్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా, న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది.

కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరోసారి భారత బౌలర్లపై విరుచుకుపడుతూ 137 పరుగులతో చెలరేగాడు. అతనికి తోడుగా గ్లెన్ ఫిలిప్స్ కూడా సెంచరీ (106) సాధించడంతో ఆ జట్టు భారీ స్కోరును నమోదు చేసింది.

భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ చెరో మూడు వికెట్లు తీశారు.338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌట్ అయింది. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తక్కువ పరుగులకే వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది.

అయితే విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ (124) తో ఒంటరి పోరాటం చేసినప్పటికీ, అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సరైన మద్దతు లభించలేదు. కివీస్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్ కీలక సమయంలో మూడు వికెట్లు తీసి భారత ఓటమిని శాసించాడు.

ఈ విజయంతో భారత్ గడ్డపై న్యూజిలాండ్ చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని నమోదు చేయగా, అద్భుత ప్రదర్శన చేసిన డారిల్ మిచెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.

Related posts

శ్రీవారికి వెండి గంగాళం విరాళం

Satyam News

పసికందును అమ్మిన తల్లి అరెస్టు

Satyam News

వంటగ్యాస్ బ్లాక్ మార్కెట్: భూమన అనుచరుడు పరార్

Satyam News

కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ మాకు రోడ్లు లేవు

Satyam News

హమ్మయ్య… ఇప్పటికి దొరికాడు మంత్రి….

Satyam News

బీసీ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం

Satyam News

Leave a Comment