క్రీడలుహోమ్

పరుగుల వేటలో బోల్తాపడ్డ భారత్

ఇండోర్ వేదికగా జరిగిన భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేలో కివీస్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా, న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది.

కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరోసారి భారత బౌలర్లపై విరుచుకుపడుతూ 137 పరుగులతో చెలరేగాడు. అతనికి తోడుగా గ్లెన్ ఫిలిప్స్ కూడా సెంచరీ (106) సాధించడంతో ఆ జట్టు భారీ స్కోరును నమోదు చేసింది.

భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ చెరో మూడు వికెట్లు తీశారు.338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌట్ అయింది. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తక్కువ పరుగులకే వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది.

అయితే విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ (124) తో ఒంటరి పోరాటం చేసినప్పటికీ, అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సరైన మద్దతు లభించలేదు. కివీస్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్ కీలక సమయంలో మూడు వికెట్లు తీసి భారత ఓటమిని శాసించాడు.

ఈ విజయంతో భారత్ గడ్డపై న్యూజిలాండ్ చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని నమోదు చేయగా, అద్భుత ప్రదర్శన చేసిన డారిల్ మిచెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.

Related posts

చీలిక అంచున సమాజ్ వాదీ పార్టీ?

Satyam News

స్విట్జర్లాండ్‌లో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు

Satyam News

పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం

Satyam News

సానియా తో అర్జున్ టెండుల్కర్ ఎంగేజ్మెంట్

Satyam News

భారత్ సముద్ర తీరం వద్దకు వచ్చిన ‘యుద్ధం’

Satyam News

మోదీ సభ కోసం కేంద్ర మంత్రి వాల్ రైటింగ్

Satyam News

Leave a Comment