26.3 C
Hyderabad
September 19, 2026
రంగారెడ్డిహోమ్

వైభవంగా శ్రీ పరమేశ్వర లింగం శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్ కొత్తగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ పరమేశ్వరుని శివలింగం, గ్రామ దేవత శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వేద పండితులు యు. రమణ చార్యులు ఇతర పండితులు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వేడుకలు ఈ నెల 24 నుండి 26 వరకు శాస్త్రోక్తంగా జరిగాయి.

ఈ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు శ్రీ గణపతి పూజ, పుణ్యాహవచనం, వేదపరాయణం, యాగశాల ప్రవేశం, అఖండ స్థాపన, చతుర్ లింగతో భద్రమండలి, వాస్తు, యోగని, క్షేత్ర పాలక, నవగ్రహ, అష్టదిక్పాలక, అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు.

రెండవ రోజు శ్రీ గణపతి పూజ, మండప పునః పూజలు, నవగ్రహ రుద్రా, కాలభైరవ, అమ్మవారి మూల మంత్రం, శివ రుద్ర నమక చమక బిజ అక్షర హోమం, జలాధివాసం, ధాన్యధివాసం వంటి విశేష పూజలు నిర్వహించారు.

మూడవ రోజు అంటే 26 వ తేదీ ఉదయం నుండి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శివలింగం, పెద్దమ్మ తల్లి విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగాయి. అనంతరం పూర్ణాహుతి, శాంతి కళ్యాణం మరియు భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు ఆలయ ధర్మకర్త & నిర్వాహకులు రేగుల శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Related posts

మళ్లీ మొదలైన అమెరికా ఇరాన్ యుద్ధం

Satyam News

హోర్మోజ్ జలసంధి నుంచి భారత్ కు మరో రెండు నౌకలు

Satyam News

మార్కెట్లలో ‘లేపాక్షి’ జోరు..120కి పైగా ట్రేడ్ ఎంక్వైరీలు

Satyam News

కడపలో అల్లర్ల వెనుక వైసీపీ స్కెచ్…. కూటమి సర్కార్‌పై కుట్ర…!

Satyam News

ఫెసపల్లో వరల్డ్ కప్ పోటీలకు ఎంపికైన నగర క్రీడాకారులు

Satyam News

నారా లోకేష్ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్

Satyam News

Leave a Comment