రామడుగు మండల కేంద్రం, గోపాల్రావుపేట గ్రామంలో సింగల్ విండో చైర్మన్ కోల రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలరావుపేట్ గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ విమోచన పోరాటంలో పాల్గొన్న వీరుల త్యాగాలను స్మరించుకున్నారు
తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం నాటి పోరాట యోధులు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో రామడుగు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జవ్వాజి హరీశ్, డైరెక్టర్లు బద్దం లక్ష్మారెడ్డి, కాడే శంకర్, ఎల్లయ్య, వేణుగోపాల్, శంకర్, పంజాల శ్రీనివాస్, మల్లేశం, స్వామి, నారాయణ, వెంకటేష్, అనుపురం పరుశురాం,శేఖర్,లక్ష్మీనారాయణ,మాణిక్యం, బిట్టు, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజమ్, శ్రావణ్, రామ్ రెడ్డి, రవి, సాగర్, మల్లేశం, మహేష్,ప్రజాప్రతినిధులు, సర్పంచులు మార్కెట్ కమిటీ పాలకవర్గం, సింగిల్ విండో పాలకవర్గం, మహిళలు ,రైతులు వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
