భారతీయ మజ్దూర్ సంఘం బిఎంఎస్ జాతీయ అధ్యక్షుడుగా తెలంగాణకు చెందిన సుంకరి మల్లేశం ఆదివారం ఎన్నికయ్యారు. ఛత్తీస్ ఘడ్ కు చెందిన సురేంద్ర పాండే జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఎన్నికయ్యారు.
ఒడిశాలోని జరుగుతున్న బిఎంఎస్ జాతీయ మహాసభల్లో నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించగా అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన మల్లేశం ఎన్నికయ్యారు. మల్లేశం గతంలో తెలంగాణ రాష్ట అధ్యక్షుడిగా, జాతీయ ఉపాధ్యక్షుడుగా సేవలందించారు.
ESI కొర్పరేషన్ సభ్యులుగా సేవలు అందించిన మల్లేశం ప్రస్తుతం ఈపీఎఫ్ ట్రస్టీ గా ఉన్నారు. వారి స్వస్థలం తాండూరు, రంగారెడ్డి జిల్లా కాగా సురేంద్ర పాండే జాతీయ ప్రధాన కార్యదర్శి గా 2023 నుంచి 2026 వరకు బాధ్యత నిర్వహిస్తారు.
కోల్ ఇండియ లో ఉద్యోగం చేస్తున్న పాండే బాల్యం నుండి RSS లొ చురుకైన కార్యకర్త గా ఉన్నారు.
