25.2 C
Hyderabad
September 20, 2026
కర్నూలుహోమ్

ఎమ్మిగనూరు లో ఘనంగా మహిళా దినోత్సవం

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మహిళల ఆత్మగౌరవం, అచంచల సంకల్పం, సమాజ అభివృద్ధిలో వారి కీలక పాత్రను గుర్తిస్తూ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు. యువ విద్యార్థినులతో పరస్పర సంభాషణ, వివిధ రంగాల్లో వారి ప్రతిభను చాటిన మహిళాలకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శాలువా కప్పి, పూల మాలతో సత్కరించారు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

మహిళల సామాజిక సాధికారత, ఆర్థిక స్వావలంబన మరియు సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి స్పష్టమైంది అని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుర్నీ కార్పొరషన్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మిగనూరు ఎంపీడీవో, మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, నాయకులు మహిళలు పాల్గొన్నారు. వడ్డే కృష్ణ 29వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కూడా పాల్గొన్నారు.

Related posts

పీ 4 పై దుష్ప్రచారం తగదు

Satyam News

భక్తులతో పోటెత్తిన పారుపెల్లి శ్రీ కాలభైరవ ఆలయం

Satyam News

ఆవుల‌ను త‌ర‌లిస్తే ఖ‌బ‌డ్దార్‌: అర్ద‌రాత్రి ఎస్పీ త‌నిఖీలు

Satyam News

బోనాలు.. తెలంగాణ జీవనస్రవంతికి సాంస్కృతిక సాక్ష్యం

Satyam News

ఫేస్ బుక్ కు కష్టకాలం: జుకర్‌బర్గ్ కు మోడీ ప్రభుత్వం వార్నింగ్

Satyam News

తీవ్ర రూపం దాల్చిన బోడుప్పల్ వక్ఫ్ భూముల సమస్య

Satyam News

Leave a Comment