కర్నూలుహోమ్

ఎమ్మిగనూరు లో ఘనంగా మహిళా దినోత్సవం

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మహిళల ఆత్మగౌరవం, అచంచల సంకల్పం, సమాజ అభివృద్ధిలో వారి కీలక పాత్రను గుర్తిస్తూ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు. యువ విద్యార్థినులతో పరస్పర సంభాషణ, వివిధ రంగాల్లో వారి ప్రతిభను చాటిన మహిళాలకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శాలువా కప్పి, పూల మాలతో సత్కరించారు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

మహిళల సామాజిక సాధికారత, ఆర్థిక స్వావలంబన మరియు సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి స్పష్టమైంది అని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుర్నీ కార్పొరషన్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మిగనూరు ఎంపీడీవో, మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, నాయకులు మహిళలు పాల్గొన్నారు. వడ్డే కృష్ణ 29వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కూడా పాల్గొన్నారు.

Related posts

మేడారం జాతర పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీ

Satyam News

రోడ్డెక్కిన జనసేన కార్యకర్తలు

Satyam News

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క

Satyam News

ఢిల్లీ ‘యశోభూమి’లో ఏపీ టూరిజం స్టాళ్లకు విశేష స్పందన

Satyam News

అంతరించిపోతున్న నాటక రంగానికి ఊపిరి

Satyam News

యాదగిరిగుట్టలో వేదపాఠశాలకు శంకుస్థాపన

Satyam News

Leave a Comment