కర్నూలుహోమ్

ఎమ్మిగనూరు లో ఘనంగా మహిళా దినోత్సవం

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మహిళల ఆత్మగౌరవం, అచంచల సంకల్పం, సమాజ అభివృద్ధిలో వారి కీలక పాత్రను గుర్తిస్తూ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు. యువ విద్యార్థినులతో పరస్పర సంభాషణ, వివిధ రంగాల్లో వారి ప్రతిభను చాటిన మహిళాలకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శాలువా కప్పి, పూల మాలతో సత్కరించారు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

మహిళల సామాజిక సాధికారత, ఆర్థిక స్వావలంబన మరియు సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి స్పష్టమైంది అని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుర్నీ కార్పొరషన్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మిగనూరు ఎంపీడీవో, మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, నాయకులు మహిళలు పాల్గొన్నారు. వడ్డే కృష్ణ 29వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కూడా పాల్గొన్నారు.

Related posts

దక్షిణ మధ్య రైల్వేలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam News

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

Satyam News

పై వాడికి ఇవ్వాలి… చందాలు ఇవ్వండి…

Satyam News

ఏపీ లిక్కర్ స్కామ్: ఐటి దాడులు

Satyam News

అమెరికాలో వీసా మోసం: భారతీయుడి దేశ బహిష్కరణ

Satyam News

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు

Satyam News

Leave a Comment